Bombay Stock Exchange: మదుపర్ల సంపద@ 5లక్షల కోట్లు
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బీఎస్ఈలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
6 నెలల్లోపే పెరిగిన లక్ష కోట్ల డాలర్ల సంపద
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బీఎస్ఈలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రికార్డు గరిష్ఠమైన రూ.414.62 లక్షల కోట్లుగా నమోదైంది. సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠానికి కంటే 1170 పాయింట్లు దిగువనే ఉన్నప్పటికీ.. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు తాజా గరిష్ఠాలకు చేరాయి.
- నీ 2023 నవంబరు 29న బీఎస్ఈ మొత్తం మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల)కు చేరింది. అక్కడ నుంచి ఆరు నెలల్లోపే 5 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని తాకింది.
- నీ బ్లూమ్బర్గ్ ప్రకారం.. 2024లో ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్ విలువ దాదాపు 12% పెరిగింది.
బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో: బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో మంగళవారం సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోగా, నిఫ్టీ లాభపడింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 83.31 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.55% నష్టంతో 83.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- సెన్సెక్స్ ఉదయం 73,842.96 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం లాభాల్లోకి వచ్చి, 74,189.19 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సూచీ, 52.63 పాయింట్లు తగ్గి 73,953.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.05 పాయింట్లు పెరిగి 22,529.05 దగ్గర స్థిరపడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 16 నష్టపోయాయి. నెస్లే 1.62%, మారుతీ 1.06%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.85%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.84%, హెచ్యూఎల్ 0.74% డీలాపడ్డాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ 3.68%, పవర్గ్రిడ్ 2.71%, ఎన్టీపీసీ 1.50%, టెక్ మహీంద్రా 1.39%, ఏషియన్ పెయింట్స్ 1.20% లాభపడ్డాయి.
- రికార్డు గరిష్ఠానికి టాటా స్టీల్ షేరు: ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో టాటా స్టీల్ షేరు రికార్డు గరిష్ఠాలకు చేరింది. ఇంట్రాడేలో రూ.175.20 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకిన షేరు, చివరకు 3.81% లాభంతో రూ.174.30 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2.17 లక్షల కోట్లుగా నమోదైంది.
- ఆఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై 27న ప్రారంభమైంది. ధరల శ్రేణిగా రూ.363- 383ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.599 కోట్లు సమీకరించనుంది.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమ రుణ పంపిణీ రికార్డు స్థాయిలో 18.6% పెరిగి రూ.61,703.26 కోట్లకు చేరినట్లు ముత్తూట్ ఫిన్కార్ప్ ప్రకటించింది.
- ఎస్బీఐ ఛైర్మన్ పదవికి ఈనెల 22న జరగాల్సిన అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూల ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎఫ్ఎస్ఐబీ వెల్లడించింది.
- మల్టిపుల్ మైలోమా (బోన్ మెటాస్టాసెస్) అనే క్యాన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే డెనోసుమ్యాబ్ అనే బయోసిమిలర్ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, యూఎస్కు చెందిన అల్వోటెక్ అనే బయోటెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం యూఎస్తో పాటు, యూకే, కొన్ని ఐరోపా దేశాల్లో ఈ మందును విక్రయించే అవకాశం డాక్టర్ రెడ్డీస్కు లభిస్తోంది.
- డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అనుబంధ కంపెనీ అయిన అరిజీన్ డిస్కవరీ టెక్నాలజీస్ లిమిటెడ్కు జీఎస్టీ నోటీసు జారీ అయింది. రూ.64.94 లక్షల జీఎస్టీ పెనాల్టీ చెల్లించాలని ఆదేశిస్తూ, టీజీఎస్టీ, సీజీఎస్టీ చట్టాల్లోని సెక్షన్ - 73 కింద మాదాపూర్ (హైదరాబాద్) లోని అసిస్టెంట్ కమిషనర్ ఈ నోటీసు ఇచ్చారు.
నేటి బోర్డు సమావేశాలు: సన్ ఫార్మా, పవర్గ్రిడ్, గ్రాసిమ్, మ్యాక్స్ హెల్త్కేర్, టొరెంట్ పవర్, నైకా, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, జుబిలెంట్ ఫుడ్వర్క్స్, మెట్రో బ్రాండ్స్, గ్లాండ్ ఫార్మా, పేటీఎం, రామ్కో సిమెంట్స్, అవంతీ ఫీడ్స్, ఇండిగో పెయింట్స్, కావేరీ సీడ్, పెన్నార్ ఇండస్ట్రీస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం