Gold: బంగారం ఇప్పుడు కొనొచ్చా?
ఇటీవల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు కొంతమేర దిగి వచ్చాయి. ఈ లోహ ధరలకు అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువే కీలకం.
గరిష్ఠాల నుంచి 10 గ్రాములకు రూ.4000 తగ్గింది
వెండి కిలోకు రూ.8500 పతనం
డాలర్ విలువ, అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ఈనాడు వాణిజ్య విభాగం
ఇటీవల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు కొంతమేర దిగి వచ్చాయి. ఈ లోహ ధరలకు అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువే కీలకం. దేశీయంగా కూడా ఏప్రిల్లో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేనందున, గిరాకీ తక్కువగానే ఉందని విక్రేతలు చెబుతున్నారు. పుత్తడి ధర బాగా పెరిగిన నేపథ్యంలో పాత ఆభరణాలు మార్చుకుని, కొత్తవి తీసుకోవడం పెరుగుతోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) కూడా ఇటీవలి నివేదికలో పేర్కొనడం గమనార్హం. ధరలు ఇంకా తగ్గుతాయా, వేచి చూడొచ్చా అని పలువురు ఆలోచిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయులకు చేరడం, మన దేశంలో మహిళలకు శరాఘాతమే అయ్యింది. ఏ శుభకార్యమైనా కొత్త ఆభరణం కొనుగోలు చేసుకోవడంలో వారికి ఉండే ఆసక్తే ఇందుకు కారణం. పాశ్చాత్య దేశాల్లో బంగారం, వెండిపై ఆసక్తి ..పెట్టుబడికి మాత్రమే ఎక్కువగా పరిమితం అవుతుంది. మనం షేర్లపై పెట్టుబడి పెట్టినట్లు, బంగారం-వెండి ఫ్యూచర్ కాంట్రాక్టులు కొనుగోలు చేసి, లాభానికి విక్రయించడం అక్కడ ఎక్కువ. లోహ రూపంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగేది భారత్, చైనాల్లోనే.
అంతర్జాతీయంగా తక్కువగానే ఉన్నా
అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర గతేడాది మార్చిలో 2052 డాలర్లు పలికితే, ఇప్పుడు 1815 డాలర్లు మాత్రమే ఉంది. అప్పట్లో డాలర్ విలువ రూ.76 కాగా, ఇప్పుడు రూ.82 దగ్గర ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔన్సు బంగారం 1952 డాలర్లు పలుకగా, దేశీయంగా 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర రూ.60,900కు చేరింది. ఫిబ్రవరి నుంచి చూస్తే అంతర్జాతీయంగా ఔన్సు ధర 137 డాలర్లు తగ్గితే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.4000 తగ్గి, రూ.56900కు చేరింది. అదేవిధంగా కిలో వెండి ధర కూడా రూ.72,000 నుంచి రూ.8500 తగ్గి రూ.63,500 స్థాయికి దిగి వచ్చింది.
ఇంకా తగ్గుతుంది
బంగారం ధర గరిష్ఠస్థాయులకు చేరినప్పుడు కూడా చిన్న పట్టణాల్లో అమ్మకం, ఆ ధర మేర జరగలేదని బులియన్ అసోసియేషన్ ప్రముఖులు తెలిపారు. అప్పట్లో గ్రాముకు రూ.270 చొప్పున తగ్గించే పలు ప్రాంతాల్లో అమ్మకాలు జరిపినట్లు వివరించారు. ఇప్పుడు కూడా ధర మరింత తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా కూడా ఔన్సు బంగారం ధర మరో 40-50 డాలర్లు తగ్గొచ్చని, ఇందువల్ల దేశీయ విపణిలోనూ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55,000 స్థాయికి, వెండి కిలో రూ.61,000 దరిదాపులకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ముంబయి బులియన్ వర్తకులు కూడా ఇదే అంచనాతో ఉన్నారని తెలిపారు. అందువల్ల ధరలను నిత్యం గమనిస్తూ, తాము అనుకున్న ధర వచ్చినప్పుడు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
బిల్లు లేకుండా కొనడం ప్రమాదకరమే
పసిడి ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, బిల్లు లేకుండా అయితే కొంత తక్కువకే ఆభరణం లభిస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే పదుల సంఖ్యలో షోరూమ్లను నిర్వహించే కార్పొరేట్ సంస్థలేవీ బిల్లు లేకుండా అమ్మకాలు జరపవు. స్థానికంగా ఉన్న దుకాణదారులు మాత్రమే బిల్లు లేకుండా ఆభరణాలు విక్రయించే అవకాశం ఉంది. అయితే బిల్లు లేకపోయినా, బంగారం ధరలో వ్యాపారులు తగ్గించగలిగేది జీఎస్టీ రూపేణ వసూలు చేసే 3 శాతం మాత్రమే. అంటే రూ.లక్షకు రూ.3000 మాత్రమే ఆదా అవుతుంది. కానీ బిల్లు లేకుండా కొంటే ఆభరణంలోని బంగారం స్వచ్ఛతకు భద్రత ఏమీ ఉండదు. సదరు దుకాణదారుపై నమ్మకంతో కొనుగోలు చేసినా, క్యారెట్ మీటరుతో పరీక్షించుకుంటేనే ఉత్తమం. లేకపోతే 22 క్యారెట్లకు (916 స్వచ్ఛత) బదులు తక్కువ నాణ్యత ఉండే బంగారాన్ని అంటగట్టే ప్రమాదముంది. ఇందువల్ల బిల్లు లేకుండా కొనుగోలు చేసినందున, పొందే లాభం కంటే నష్టపోయే మొత్తమే అధికంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..