Tesla: భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం!
వాషింగ్టన్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) భారత పర్యటన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆయన రాక, దేశంలో ఆ కంపెనీ పెట్టుబడులు దాదాపు ఖాయమనే అనుకున్నారంతా. షోరూమ్ల కోసం స్థలాలు కూడా అన్వేషిస్తున్నారని వార్తలు రావటంతో త్వరలో మన రోడ్లపై టెస్లా (Tesla) కార్లు పరుగెడతాయనుకున్నారు. కానీ, మంగళవారం టెస్లా చేసిన ఓ కీలక ప్రకటనతో కంపెనీ భారత ప్రణాళికల్లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
తయారీ సామర్థ్యం పెంపు..
త్వరలో తమ తయారీ సామర్థ్యాన్ని 50 శాతం పెంచనున్నట్లు టెస్లా ప్రకటించింది. కొత్త తయారీ లైన్ల ఏర్పాటు కంటే ముందే దీన్ని చేపడతామని తెలిపింది. ప్రస్తుతం టెస్లా వార్షిక తయారీ సామర్థ్యం 30 లక్షల యూనిట్లుగా ఉంది. తాజాగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గిస్తూనే తయారీని పెంచడానికి ఇదే సరైన నిర్ణయంగా తాము భావిస్తున్నామని కంపెనీ తెలిపింది. టెస్లా నిర్ణయంపై స్టాక్ మార్కెట్ మదుపర్లు సానుకూలంగా స్పందించారు. ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫ్యూచర్ మార్కెట్లో టెస్లా షేర్ల విలువ 12 శాతం పెరిగింది. తొలి త్రైమాసికం ఫలితాల్లో కంపెనీ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ షేర్లు పాజిటివ్గా ఉండడం గమనార్హం.
భారత ప్రణాళికలు పక్కకు..
కొత్త తయారీ లైన్ల ఏర్పాటు కంటే ముందు.. ఇప్పటికే ఉన్నవాటి సామర్థ్యం పెంచుతామని టెస్లా ప్రకటించటంతో భారత్లో పెట్టుబడులు ఇప్పట్లో ఉండకపోవచ్చుననే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇండియాతో పాటు మెక్సికో ప్రణాళికలను సైతం టెస్లా తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ (Elon Musk) తన భారత పర్యటనను చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మంగళవారం టెస్లాను ప్రశ్నించగా.. ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
పోటీ తట్టుకునేలా..
అతిపెద్ద మార్కెట్లయిన చైనా, అమెరికాలో టెస్లా కార్లకు గిరాకీ గణనీయంగా పడిపోయింది. అలాగే చైనా కంపెనీల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. దీంతో టెస్లా కొత్త పంథా అనుసరించేందుకు సిద్ధమైంది. 25,000 డాలర్లలోపు ధరతో కార్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిని 2025 ద్వితీయార్ధంలో అందుబాటులోకి తీసుకొస్తామని స్వయంగా మస్క్ జనవరిలో ప్రకటించారు. టెస్లా తర్వాత దశ వృద్ధికి ఇది దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగానే తాజాగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ నెల 21, 22 తేదీల్లో భారత పర్యటనకు ఎలాన్ మస్క్ రావాల్సింది. కానీ, వివిధ కారణాల వల్ల దాన్ని ఏడాది చివరకు వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. భారత్లోకి టెస్లా ప్రవేశంపై సుదీర్ఘ కాలంగా ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. మస్క్ రాకతో వాటన్నింటికీ తెరపడతాయని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మరోవైపు అమెరికా సహా చైనా మార్కెట్లో కార్ల ధరలను కంపెనీ ఇటీవల గణనీయంగా తగ్గించింది. పోటీని తట్టుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..