Twitter CEO: ట్విటర్ సీఈఓగా లిండా యాకరినో? ఇంతకీ ఎవరీమె?
Twitter CEO: ట్విటర్కు కొత్త సీఈఓ రానున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కానీ, ఎవరనేది మాత్రం బహిర్గతం చేయలేదు. అయితే, లిండా యాకరినో పేరు ఈ రేసులో ముందుంది. ఇంతకీ ఎవరీమె? తెలుసుకుందాం..!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్కు కొత్త సీఈఓ (Twitter CEO) రావడం ఖాయమైంది. ఈ బాధ్యతల్ని ఓ మహిళ తీసుకోనున్నట్లు ప్రస్తుత సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు. అయితే, ఆమె ఎవరనేది మాత్రం బహిర్గతం చేయలేదు. మరో ఆరు వారాల్లో ఆమె బాధ్యతలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే, అమెరికా కార్పొరేట్ వర్గాలకు సుపరిచితమైన లిండా యాకరినో (Linda Yaccarino) కొత్త సీఈఓ అని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎవరీ లిండా?
లిండా (Linda Yaccarino) ప్రస్తుతం ఎన్బీసీయూనివర్సల్లో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్నర్షిప్స్ విభాగం ఛైర్పర్సన్గా ఉన్నారు. ఆమె ట్విటర్ను ముందుకు నడిపే బాధ్యతలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆమెతో మస్క్ గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. దాదాపు ఆమె పేరే సీఈఓగా ఖరారు కావొచ్చని ట్విటర్ (Twitter) వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- యాకరినో గత నెల ఓ కార్యక్రమంలో మస్క్ను ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరివురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది.
- ఎన్బీసీయూనివర్సల్లో లిండా (Linda Yaccarino) దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారు. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై ఆమె పనిచేస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్ స్ట్రీమింగ్ సర్వీసెస్లో ఆమెది కీలక పాత్ర.
- అంతకు ముందు టర్నర్ ఎంటర్టైన్మెంట్లో యాకరినో 19 ఏళ్ల పాటు పనిచేశారు. యాడ్ సేల్స్ను డిజిటల్ రూపంలోకి మార్చడంలో కీలకంగా వ్యవహరించారు.
- పెన్ స్టేట్ యూనివర్సిటీలో లిండా (Linda Yaccarino) లిబరల్ ఆర్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ చదివారు.
- ట్విటర్లో మస్క్ చేస్తున్న మార్పులకు ఆమె ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ట్విటర్ మస్క్ చేతికి వచ్చినప్పటి నుంచే ఆమె సీఈఓగా ఉండడానికి ఆసక్తి వ్యక్తం చేసినట్లు సన్నిహితులు తెలిపారు. అయితే, కంపెనీలో కీలక మార్పులు పూర్తయ్యే వరకు ఎలాన్ మస్క్కు సమయం ఇవ్వాలని ఆమె భావించారట!
☛ మరోవైపు యాకరినోతో పాటు ట్విటర్లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగానికి ఇంఛార్జిగా ఉన్న ఎల్లా ఇర్విన్ కూడా సీఈఓ రేసులో ఉన్నట్లు బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది. ఇటీవల పదోన్నతి పొందిన ఆమె ఎలాన్ మస్క్తో కలిసి చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ట్విటర్కు కొత్త సీఈఓ (Twitter CEO)ను నియమిస్తామనని ఎలాన్ మస్క్ గతంలోనే సంకేతాలిచ్చారు. ఇప్పటికే స్పేస్ఎక్స్, టెస్లా సహా మరికొన్ని కంపెనీలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. విశ్రాంతి లేకుండా పని ఉంటోందని గతంలో ఓసారి ఆయనే స్వయంగా చెప్పారు. మరోవైపు ట్విటర్ సీఈఓ (Twitter CEO)గా తాను వైదొలగాలా అని గత డిసెంబర్లో పోల్ నిర్వహించారు. 57.5 శాతం మంది ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మరోవైపు ట్విటర్ సీఈఓ పదవిపై మస్క్ గతంలో కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. సీఈఓ కుర్చీలో శునకాన్ని కూర్చోబెట్టిన ఫొటో ట్వీట్ చేశారు. మరోవైపు ట్విటర్ను ముందుకు నడిపించే ‘‘తెలివి తక్కువ’’ వ్యక్తి దొరికే వరకు తానే సీఈఓగా కొనసాగుతానని కూడా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్