ChatGPT: చాట్జీపీటీపై నిషేధం విధించిన ఇటలీ..
ప్రపంచవ్యాప్తంగా చాట్జీపీటీ(ChatGPT) చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీని వాడకంపై ఇటలీ నిషేధం విధించింది.
రోమ్: ఇప్పుడు ఎక్కడ చూసినా చాట్జీపీటీ(ChatGPT) గురించే చర్చ. చాట్జీపీటీ అనేది కృత్రిమ మేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్. టెక్ రంగంలోకి దీని ప్రవేశంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐరోపా దేశం ఇటలీ(Italy) ఈ అప్లికేషన్పై నిషేధం విధించింది. తక్షణం అమల్లోకి వచ్చేలా ఇటలీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో దానిని బ్లాక్ చేశారు. ఈ చాట్బాట్ను బ్లాక్ చేసిన మొదటి ఐరోపా దేశం ఇటలీనే కావడం గమనార్హం (Italy Bans ChatGPT)
తాము చాట్జీపీటీని బ్లాక్ చేస్తున్నట్లు శుక్రవారం ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది. అలాగే ఇది తమ దేశ సమాచార భద్రతా నియంత్రణలకు లోబడి ఉందా..? లేదా..? అనేదానిపై విచారణ జరుపుతామని తెలిపింది. డేటా ఉల్లంఘనకు సంబంధించిన కేసు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దీనిపై చైనా, రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా నిషేధం విధించాయి.
గత ఏడాది చివరిలో చాట్జీపీటీ ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సాంకేతికరంగంలో ప్రపంచవ్యాప్తంగా చాట్జీపీటీ (ChatGPT) ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది. దాదాపు అన్ని టెక్ దిగ్గజ సంస్థలు దీనిపై దృష్టి సారించాయి. చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ (Open AI)కి మైక్రోసాఫ్ట్ (Microsoft)సహకారం ఉంది. ఆ సంస్థ అందులో పెట్టుబడులు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా