ITC: ఐటీసీ లాభం రూ.5,191 కోట్లు
ఐటీసీ, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,190.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,242.59 కోట్లతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువ.
తుది డివిడెండ్ 750%
దిల్లీ: ఐటీసీ, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,190.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,242.59 కోట్లతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువ. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.19,058.29 కోట్ల నుంచి 2% పెరిగి రూ.19,446.49 కోట్లకు చేరింది. ఉత్పత్తుల విక్రయం ద్వారా స్థూల ఆదాయం రూ.18,779.18 కోట్ల నుంచి 2.61% పెరిగి రూ.19,291.40 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలూ 3% అధికమై రూ.13,294.30 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం 2.35% పెరిగి రూ.20,130.32 కోట్లకు చేరింది. ‘మార్చి త్రైమాసికంలో వినియోగ గిరాకీ స్తబ్దుగా ఉంది. ప్రస్తుతం స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవుతుండటం, కొన్ని త్రైమాసికాల తర్వాత గ్రామీణ గిరాకీ పుంజుకుంటుండటం, సాధారణ వర్షపాతం అంచనాల వల్ల సమీప కాలంలో వినియోగ గిరాకీ రాణిస్తుంద’ని ఐటీసీ అంచనా వేసింది.
- ఎఫ్ఎంసీజీ విభాగ ఆదాయం (సిగరెట్ వ్యాపారంతో కలిపి) రూ.13,033.43 కోట్ల నుంచి 7.4% పెరిగి రూ.13,996.86 కోట్లకు చేరింది. ఇందులో సిగరెట్ వ్యాపార ఆదాయం రూ.8,082.26 కోట్ల నుంచి 7.5% వృద్ధితో రూ.8,688.92 కోట్లుగా నమోదైంది.
- ఎఫ్ఎంసీజీ యేతర విభాగ ఆదాయం రూ.4,951.17 కోట్ల నుంచి 7.61% పెరిగి రూ.5,307.94 కోట్లకు చేరింది. ఐటీసీ హోటల్స్ విభాగ ఆదాయం రూ.808.72 కోట్ల నుంచి 15.12% పెరిగి రూ.931.03 కోట్లకు చేరింది. అగ్రి బిజినెస్ ఆదాయం రూ.3,607.30 కోట్ల నుంచి 13.05% తగ్గి రూ.3,136.43 కోట్లకు పరిమితమైంది. పేపర్బోర్డ్లు, పేపర్, ప్యాకేజింగ్ విభాగ ఆదాయం రూ.2,221.01 కోట్ల నుంచి 6.67% తగ్గి రూ.2,072.86 కోట్లకు పరిమితమైంది. ఇతర విభాగాల ఆదాయం (ఐటీ సేవలు, బ్రాండెడ్ రెసిడెన్స్లు తదితరాలు) రూ.868.29 కోట్ల నుంచి 11.46% పెరిగి రూ.967.80 కోట్లకు చేరింది.
- 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ ఏకీకృత నికర లాభం రూ.19,476.42 కోట్ల నుంచి 6.54% పెరిగి రూ.20,751.36 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం రూ.76,518.21 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.76,840.49 కోట్లకు చేరింది.
- రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.7.50 (750%) చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. గతంలో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్ రూ.6.25తో కలిపి, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం డివిడెండ్ రూ.13.75 అందించినట్లు అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి