Bluesky: ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. ప్రస్తుతానికి వారికి మాత్రమే..!
Bluesky: ట్విటర్కు పోటీగా తీసుకొస్తున్నట్లు భావిస్తున్న బ్లూస్కై అనే సామాజిక మాధ్యమం ఐఓఎస్ యూజర్లకు యాప్ స్టోర్లో అందుబాటులోకి వచ్చింది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే దీని యాక్సెస్ ఉంది.
Bluesky: ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే (Jack Dorsey) తన కొత్త సామాజిక మాధ్యమం బ్లూస్కై (BlueSky) బీటా వెర్షన్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ వివరాల ప్రకారం.. ఐఓఎస్ యాప్ స్టోర్లో బ్లూస్కై (BlueSky) ఫిబ్రవరి 17నే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 2,000 మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. ప్లస్ బటన్ను క్లిక్ చేసి 256 క్యారెక్టర్లతో కూడిన పోస్ట్ను క్రియేట్ చేసేలా యాప్ ఇంటర్ఫేస్ను డిజైన్ చేశారు. ట్విటర్ పోస్ట్ బాక్స్లో ‘‘"What's happening?’’ అని అడుగుతుండగా.. బ్లూస్కైలో దాన్ని ‘‘What's up?’’గా మార్చారు. షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఫీచర్లు సైతం ఉన్నట్లు డేటా.ఏఐ పేర్కొంది.
యాప్ నావిగేషన్లో మధ్యలో డిస్కవర్ అనే ట్యాబ్ను పొందుపర్చినట్లు డేటా.ఏఐ వెల్లడించింది. ఎవర్ని ఫాలో కావాలి, రీసెంట్ పోస్ట్ల వంటి వాటిని సెర్చ్ చేయడానికి అది ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది. మరో ట్యాబ్లో నోటిఫికేషన్లు, లైక్స్, రీపోస్ట్లు, ఫాలోస్, రిప్లైలు.. ఇలా ట్విటర్ తరహా ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. కావాల్సిన వారి కోసం సెర్చ్ చేసి ఫాలో అయ్యే ఆప్షన్ కూడా ఉంది. యూజర్ ఫ్రొఫైల్లో ప్రొఫైల్ పిక్, బ్యాగ్రౌండ్, బయో, మెట్రిక్స్ అనే ఆప్షన్లున్నాయి.
2019లో బ్లూస్కై ప్రాజెక్టు ప్రారంభమైంది. కానీ, కంపెనీ మాత్రం 2022లో ఉనికిలోకి వచ్చింది. ట్విటర్ను వీడిన తర్వాతే డోర్సే తొలిసారి బ్లూస్కై గురించి మాట్లాడారు. దీన్ని ‘ఓపెన్ డిసెంట్రలైజ్డ్ స్టాండర్డ్ ఫర్ సోషల్ మీడియా’గా అభివర్ణించారు. సామాజిక మాధ్యమ ప్రాథమిక అంశాలను, యూజర్ల డేటాను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కంపెనీలకు బ్లూస్కై పోటీనిస్తుందని గత అక్టోబర్లో ప్రకటించారు. పరోక్షంగా ట్విటర్కు పోటీగా దీన్ని తీసుకొస్తున్నట్లు సంకేతాలిచ్చారు. బ్లూస్కై గత ఏడాది 13 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. డోర్సే కంపెనీ బోర్డులో ఉండగా.. ట్విటర్ మాజీ సెక్యూరిటీ ఇంజినీర్ సైతం ఇటీవలే చేరినట్లు బ్లూస్కై ఇటీవల ట్వీట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు