Bluesky: ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. ప్రస్తుతానికి వారికి మాత్రమే..!
Bluesky: ట్విటర్కు పోటీగా తీసుకొస్తున్నట్లు భావిస్తున్న బ్లూస్కై అనే సామాజిక మాధ్యమం ఐఓఎస్ యూజర్లకు యాప్ స్టోర్లో అందుబాటులోకి వచ్చింది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే దీని యాక్సెస్ ఉంది.
Bluesky: ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే (Jack Dorsey) తన కొత్త సామాజిక మాధ్యమం బ్లూస్కై (BlueSky) బీటా వెర్షన్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ వివరాల ప్రకారం.. ఐఓఎస్ యాప్ స్టోర్లో బ్లూస్కై (BlueSky) ఫిబ్రవరి 17నే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 2,000 మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. ప్లస్ బటన్ను క్లిక్ చేసి 256 క్యారెక్టర్లతో కూడిన పోస్ట్ను క్రియేట్ చేసేలా యాప్ ఇంటర్ఫేస్ను డిజైన్ చేశారు. ట్విటర్ పోస్ట్ బాక్స్లో ‘‘"What's happening?’’ అని అడుగుతుండగా.. బ్లూస్కైలో దాన్ని ‘‘What's up?’’గా మార్చారు. షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఫీచర్లు సైతం ఉన్నట్లు డేటా.ఏఐ పేర్కొంది.
యాప్ నావిగేషన్లో మధ్యలో డిస్కవర్ అనే ట్యాబ్ను పొందుపర్చినట్లు డేటా.ఏఐ వెల్లడించింది. ఎవర్ని ఫాలో కావాలి, రీసెంట్ పోస్ట్ల వంటి వాటిని సెర్చ్ చేయడానికి అది ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది. మరో ట్యాబ్లో నోటిఫికేషన్లు, లైక్స్, రీపోస్ట్లు, ఫాలోస్, రిప్లైలు.. ఇలా ట్విటర్ తరహా ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. కావాల్సిన వారి కోసం సెర్చ్ చేసి ఫాలో అయ్యే ఆప్షన్ కూడా ఉంది. యూజర్ ఫ్రొఫైల్లో ప్రొఫైల్ పిక్, బ్యాగ్రౌండ్, బయో, మెట్రిక్స్ అనే ఆప్షన్లున్నాయి.
2019లో బ్లూస్కై ప్రాజెక్టు ప్రారంభమైంది. కానీ, కంపెనీ మాత్రం 2022లో ఉనికిలోకి వచ్చింది. ట్విటర్ను వీడిన తర్వాతే డోర్సే తొలిసారి బ్లూస్కై గురించి మాట్లాడారు. దీన్ని ‘ఓపెన్ డిసెంట్రలైజ్డ్ స్టాండర్డ్ ఫర్ సోషల్ మీడియా’గా అభివర్ణించారు. సామాజిక మాధ్యమ ప్రాథమిక అంశాలను, యూజర్ల డేటాను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కంపెనీలకు బ్లూస్కై పోటీనిస్తుందని గత అక్టోబర్లో ప్రకటించారు. పరోక్షంగా ట్విటర్కు పోటీగా దీన్ని తీసుకొస్తున్నట్లు సంకేతాలిచ్చారు. బ్లూస్కై గత ఏడాది 13 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. డోర్సే కంపెనీ బోర్డులో ఉండగా.. ట్విటర్ మాజీ సెక్యూరిటీ ఇంజినీర్ సైతం ఇటీవలే చేరినట్లు బ్లూస్కై ఇటీవల ట్వీట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి