Jio Financial Services: జియో ఫిన్ మార్కెట్ క్యాప్ @ ₹2 లక్షల కోట్లు
Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు వరుసగా ఐదో రోజైన శుక్రవారమూ ర్యాలీ కొనసాగిస్తోంది.
ముంబయి: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Jio Financial Services Mcap) రూ.2 లక్షల కోట్లు దాటింది. కంపెనీ షేర్లు వరుసగా ఐదో రోజైన శుక్రవారమూ దూసుకెళ్తున్నాయి. నేడు ఓ దశలో షేరు విలువ పది శాతానికి పైగా పెరిగి రూ.347 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది 41 శాతం రిటర్న్స్ ఇవ్వడం విశేషం. గత ఐదు రోజుల్లోనే షేరు విలువ 17 శాతం మేర పుంజుకుంది.
మరోవైపు జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వాటాలు సైతం శుక్రవారం దూసుకెళ్తున్నాయి. ఓ దశలో దాదాపు 0.60 శాతం మేర ఎగసి రూ.2,988 దగ్గర రికార్డు గరిష్ఠాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.20.14 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ.2 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగినవి 13 కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ అగ్ర స్థానంలో ఉండగా.. టీసీఎస్ (రూ.14.78 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.10.78 లక్షల కోట్లు) తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.
డిసెంబర్ త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్ (Jio Financial Services) నికర లాభం రూ.293 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం రూ.269 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.413 కోట్లుగా కంపెనీ నివేదించింది. ప్రస్తుతం భారత విపణిలో ఆర్థిక సేవలు, ఫిన్టెక్ సంస్థలు పలు నియంత్రణాపరమైన చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో ఫిన్ సెక్యూర్డ్ రుణాలపై దృష్టి సారించింది. అన్సెక్యూర్డ్ లోన్ల విషయంలో అప్రమత్తతో కూడిన వ్యూహాన్ని అనుసరిస్తోంది. మరోవైపు జనవరిలో ఈ కంపెనీతో పాటు బ్లాక్రాక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్.. మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ప్రారంభించేందుకు సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.