Kairan Quazi: 14 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. అదీ స్పేస్ఎక్స్లో!
Kairan Quazi: 14 ఏళ్ల వయసులోనే స్పేస్ఎక్స్ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలో జాబ్ కొట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ, దీన్ని చేసి చూపించాడు కైరన్ క్వాజీ.
ఇంటర్నెట్ డెస్క్: ఓ కుర్రాడికి 14 ఏళ్ల వయసనగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఫ్రెండ్స్తో కబుర్లు, గ్రౌండ్లో ఆటలు, స్కూళ్లో పాఠాలు, సినిమాలు, షికార్లు.. ఇవే కదా! అవును మరి.. ఓ సాధారణ కుర్రాడి జీవితం ఇలాంటి చట్రంలోనే గడిచిపోతుంటుంది! కానీ, దీనికి భిన్నంగా ఓ పిల్లోడు మాత్రం 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్పేస్ఎక్స్ కంపెనీలో ఉద్యోగం కొట్టేశాడు. ఆ కుర్రాడి పేరే కైరన్ క్వాజీ (Kairan Quazi). అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం..
శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ (Kairan Quazi) శాంటాక్లారా యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి త్వరలోనే గ్రాడ్యుయేట్ పట్టా తీసుకోనున్నాడు. స్పేస్ఎక్స్లోని స్టార్లింక్ బృందంలో త్వరలోనే చేరనున్నానంటూ క్వాజీ తన లింక్డిన్లో ఇటీవల పోస్ట్ చేశాడు. అత్యంత పారదర్శక, సవాల్తో కూడిన సాంకేతికత, ఫన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ను తాను అధిగమించినట్లు తెలిపాడు. దీంతో స్టార్లింక్ ఇంజినీరింగ్ టీమ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరుతున్నట్లు పేర్కొన్నాడు. సామర్థ్యం, పరిపక్వతకు వయసును ఆధారంగా తీసుకునే కాలంచెల్లిన సంప్రదాయానికి స్వస్తి చెప్పి స్పేస్ఎక్స్ (SpaceX) తనకు అవకాశం కల్పించినట్లు తెలిపాడు.
లింక్డిన్ బయో ప్రకారం.. క్వాజీకి కృత్రిమ మేధ (Artificial Intelligence- AI), మెషీన్ లెర్నింగ్పై శిక్షణ పొందిన అనుభవం ఉంది. కొన్ని ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో అతను ఇంటర్న్షిప్ చేయడంతో అత్యాధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులోనే లాస్ పోసిటాస్ కమ్యూనిటీ కాలేజ్లో చేరాడు. అసోసియేట్ ఆఫ్ సైన్స్ (మేథమేటిక్స్)లో అత్యున్నత గ్రేడ్తో పాసయ్యాడు. ఇంటెల్ ల్యాబ్స్లో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ లామా నచ్మన్తో కలిసి జనరేటివ్ ఏఐపై పనిచేయడమే తన కెరీర్ను మలుపు తిప్పిందని చెప్పాడు.
రెండేళ్ల వయసులోనే క్వాజీ (Kairan Quazi) స్పష్టంగా మాట్లాడేవాడని తల్లిదండ్రులు చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మూడో తరగతికి వచ్చే సరికి టీచర్లు క్వాజీ ప్రతిభని గుర్తించి.. అతడికి సాధారణ విద్య సరిపోదని గుర్తించారట! ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా క్వాజీ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన ప్రతిభను గుర్తించి, తన సామర్థ్యంపై నమ్మకం ఉంచిన స్పేస్ఎక్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లింక్డిన్లో రాసుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా