Kairan Quazi: 14 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. అదీ స్పేస్ఎక్స్లో!
Kairan Quazi: 14 ఏళ్ల వయసులోనే స్పేస్ఎక్స్ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలో జాబ్ కొట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ, దీన్ని చేసి చూపించాడు కైరన్ క్వాజీ.
ఇంటర్నెట్ డెస్క్: ఓ కుర్రాడికి 14 ఏళ్ల వయసనగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఫ్రెండ్స్తో కబుర్లు, గ్రౌండ్లో ఆటలు, స్కూళ్లో పాఠాలు, సినిమాలు, షికార్లు.. ఇవే కదా! అవును మరి.. ఓ సాధారణ కుర్రాడి జీవితం ఇలాంటి చట్రంలోనే గడిచిపోతుంటుంది! కానీ, దీనికి భిన్నంగా ఓ పిల్లోడు మాత్రం 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్పేస్ఎక్స్ కంపెనీలో ఉద్యోగం కొట్టేశాడు. ఆ కుర్రాడి పేరే కైరన్ క్వాజీ (Kairan Quazi). అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం..
శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ (Kairan Quazi) శాంటాక్లారా యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి త్వరలోనే గ్రాడ్యుయేట్ పట్టా తీసుకోనున్నాడు. స్పేస్ఎక్స్లోని స్టార్లింక్ బృందంలో త్వరలోనే చేరనున్నానంటూ క్వాజీ తన లింక్డిన్లో ఇటీవల పోస్ట్ చేశాడు. అత్యంత పారదర్శక, సవాల్తో కూడిన సాంకేతికత, ఫన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ను తాను అధిగమించినట్లు తెలిపాడు. దీంతో స్టార్లింక్ ఇంజినీరింగ్ టీమ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరుతున్నట్లు పేర్కొన్నాడు. సామర్థ్యం, పరిపక్వతకు వయసును ఆధారంగా తీసుకునే కాలంచెల్లిన సంప్రదాయానికి స్వస్తి చెప్పి స్పేస్ఎక్స్ (SpaceX) తనకు అవకాశం కల్పించినట్లు తెలిపాడు.
లింక్డిన్ బయో ప్రకారం.. క్వాజీకి కృత్రిమ మేధ (Artificial Intelligence- AI), మెషీన్ లెర్నింగ్పై శిక్షణ పొందిన అనుభవం ఉంది. కొన్ని ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో అతను ఇంటర్న్షిప్ చేయడంతో అత్యాధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులోనే లాస్ పోసిటాస్ కమ్యూనిటీ కాలేజ్లో చేరాడు. అసోసియేట్ ఆఫ్ సైన్స్ (మేథమేటిక్స్)లో అత్యున్నత గ్రేడ్తో పాసయ్యాడు. ఇంటెల్ ల్యాబ్స్లో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ లామా నచ్మన్తో కలిసి జనరేటివ్ ఏఐపై పనిచేయడమే తన కెరీర్ను మలుపు తిప్పిందని చెప్పాడు.
రెండేళ్ల వయసులోనే క్వాజీ (Kairan Quazi) స్పష్టంగా మాట్లాడేవాడని తల్లిదండ్రులు చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మూడో తరగతికి వచ్చే సరికి టీచర్లు క్వాజీ ప్రతిభని గుర్తించి.. అతడికి సాధారణ విద్య సరిపోదని గుర్తించారట! ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా క్వాజీ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన ప్రతిభను గుర్తించి, తన సామర్థ్యంపై నమ్మకం ఉంచిన స్పేస్ఎక్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లింక్డిన్లో రాసుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల