RBI: 7% కాదు 7.2%
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా ఎనిమిదో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది. 2022 మే తదుపరి 250 బేసిస్ పాయింట్ల మేర పెంచి, రెపోరేటును 6.5 శాతంగా చేసిన ఆర్బీఐ, 2023 ఏప్రిల్ నుంచి అందులో మార్పు చేయలేదు.
2024-25 వృద్ధిరేటు అంచనాలు పెంచిన ఆర్బీఐ
ప్రైవేటు వినియోగం, గ్రామీణ గిరాకీ పెరగడం వల్లే
వరుసగా ఎనిమిదో సారీ కీలక రేట్లలో మార్పు లేదు
ద్రవ్యోల్బణ లక్ష్యం చేరాకే కోతపై ఆలోచన
ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా ఎనిమిదో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది. 2022 మే తదుపరి 250 బేసిస్ పాయింట్ల మేర పెంచి, రెపోరేటును 6.5 శాతంగా చేసిన ఆర్బీఐ, 2023 ఏప్రిల్ నుంచి అందులో మార్పు చేయలేదు.
వృద్ధిరేటు అంచనాల పెంపు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 7.2 శాతానికి ఆర్బీఐ పెంచింది. ప్రైవేటు వినియోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం ఇందుకు సహకరిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు. ‘2024-25లో ఇప్పటిదాకా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలంగానే కొనసాగాయి. దేశీయ గిరాకీ బలంగా ఉండడంతో తయారీ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. సేవల రంగమూ రాణిస్తోంది. పెట్టుబడులూ పెరుగుతున్నాయి. సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు, ఖరీఫ్ దిగుబడికి సానుకూలాంశం. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 7.2% వృద్ధి నమోదు కావొచ్చ’ని దాస్ పేర్కొన్నారు. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలతో పాటు కేంద్రం వద్ద బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్నందున మూలధన వ్యయాలు అధికమవుతాయని, అధిక సామర్థ్య వినియోగానికి, వ్యాపారాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంద’ని ఆయన అన్నారు.
రేట్ల కోత ప్రారంభించాలంటే: రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4% (2 శాతం అటూ ఇటూ)లోపునకు చేరుతుందన్న విశ్వాసం వచ్చేవరకు, రేట్ల కోత దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోబోమని దాస్ స్పష్టం చేశారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం.. డిసెంబరు త్రైమాసికంలో వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం 3.8 శాతానికి చేరనుంది. అయితే ఆ తర్వాత 5 శాతానికి పెరగొచ్చు. మొత్తం మీద 4% దరిదాపులకు చేరితేనే ‘విధాన చర్యలకు’ అవకాశం ఉంటుందని దాస్ పునరుద్ఘాటించారు.
బ్యాంకులు వ్యూహాలు మార్చుకోవాలి అవసరం: రుణాలు, డిపాజిట్లలో వృద్ధి మధ్య అంతరాన్ని పూడ్చుకోవాలంటే బ్యాంకులు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలని దాస్ అన్నారు. హామీలేని రిటైల్ రుణాల్లో భారీ వృద్ధి ఉండడంపై గతేడాది నవంబరులో ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం.. ఈ రుణాల జారీ కొంత నెమ్మదించింది. అయినా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని దాస్ పేర్కొన్నారు.
రూ.3 కోట్లు మించితేనే బల్క్ డిపాజిట్
బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ పరిమితిని ఆర్బీఐ శుక్రవారం పెంచింది. ప్రస్తుతం రూ.2 కోట్ల వరకు చేసే డిపాజిట్ను రిటైల్ టర్మ్ డిపాజిట్గా పరిగణిస్తున్నారు. అంతకుమించితే బల్క్ డిపాజిట్గా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఈ పరిమితిని రూ.3 కోట్లకు సవరించింది. బ్యాంకుల ఆస్తుల నిర్వహణను మరింత మెరుగుపరచుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ డిపాజిట్లు కాస్త అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (ఎస్ఎఫ్బీ)ల్లో రూ.3 కోట్లు అంతకు మించిన డిపాజిట్లనే బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తారు.
బ్రిటన్ నుంచి 100 టన్నుల పసిడి తెచ్చాం
బ్రిటన్లో నిల్వ ఉంచిన 100 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలను మన దేశానికి తీసుకొచ్చినట్లు దాస్ తెలిపారు. దేశీయంగా సరిపడా నిల్వ సామర్థ్యం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం మినహా, ఇందుకు మరో కారణం లేదని దాస్ స్పష్టం చేశారు. 1991 తర్వాత దేశంలోకి ఇంత భారీగా పసిడి నిల్వలను తెప్పించడం ఇదే తొలిసారి. చాలా కాలం నుంచి విదేశాల్లో మన పసిడి నిల్వలు ఉన్నాయని దాస్ అన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2023-24లో మనదేశం అధికారికంగా 27.46 మెట్రిక్ టన్నుల పసిడిని కొనుగోలు చేయడంతో, మన నిల్వలు 822 టన్నులకు చేరాయి. ఇటీవల తీసుకొచ్చిన 100 టన్నుల బంగారంతో కలిపి, దేశీయంగా నిల్వ చేసిన మొత్తం 408 మెట్రిక్ టన్నులను మించింది.
విదేశీ మారకపు నిల్వలు 651 బిలియన్ డాలర్లు
మన విదేశీ మారకపు నిల్వలు మే 31తో ముగిసిన వారానికి 4.837 బిలియన్ డాలర్లు పెరిగి కొత్త గరిష్ఠ స్థాయి అయి 651.51 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. అంతక్రితం వారంలో ఈ నిల్వలు 2.027 బి. డాలర్లు తగ్గి 646.673 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
మోసాల నివారణ కోసం..
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను నివారించి, వినియోగదారులకు భరోసా కలిగించేలా ఒక ప్రత్యేక వేదిక తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం ‘డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చెల్లింపుల మోసాలను నివారించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఎన్పీసీఐ మాజీ ఎండీ, సీఈఓ ఏపీ హోతా నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాట్ఫాం ఏర్పాటుపై ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదిక సమర్పిస్తుందని ఆర్బీఐ పేర్కొంది.
యూపీఐ లైట్లో ఆటోమేటిక్గా నిధుల భర్తీ
ఫాస్టాగ్కూ వర్తించేలా ప్రతిపాదన
చిన్న మొత్తాల్లో చేసే డిజిటల్ చెల్లింపులు ఇక నుంచి మరింత సులభం కానున్నాయి. యూపీఐ లైట్ వాలెట్లో బ్యాంకు ఖాతా నుంచి నేరుగా (ఆటోమేటిక్) నిధులు భర్తీ అయ్యే వీలు లభించడమే ఇందుకు కారణం. ఈ దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్కూ ఇదే విధానాన్ని వర్తింపచేసే దిశగా ఆర్బీఐ సూచనలు జారీ చేసింది.
- క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, లేదా ఫోన్నంబరుకు తక్కువ మొత్తం చెల్లింపులు యూపీఐ విధానంలో చేస్తున్న ప్రతిసారీ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా, బ్యాంకు ఖాతాలో ఇలాంటి చిన్న చెల్లింపుల వివరాలూ కనిపించకుండా ఉండేలా 2022 సెప్టెంబరులో ఆర్బీఐ యూపీఐ లైట్ను తీసుకొచ్చింది. దీనిలో గరిష్ఠంగా రూ.2,000 వరకూ నిధులు నిల్వ చేసుకోవచ్చు. ఒక రోజులో రూ.2,000 విలువైన లావాదేవీలను నిర్వహించొచ్చు. ఒకసారి రూ.500 వరకు యూపీఐ లైట్తో చెల్లించొచ్చు. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ‘ఇ-మ్యాండేట్’ను తీసుకొచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు. ‘యూపీఐ లైట్లో ఉన్న మొత్తం వినియోగదారులు పేర్కొన్న నిర్ణీత పరిమితికి వచ్చినప్పుడు, నేరుగా బ్యాంకు ఖాతా నుంచి గరిష్ఠ పరిమితి మేరకు నిధులు భర్తీ అవ్వవడమే ఈ విధానమ’ని దాస్ తెలిపారు. ఈ పరిమితిని వినియోగదారులే నిర్ణయించుకోవాలి. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు నిల్వను బట్టి, ఆటోమేటిక్గా వాలెట్లోకి చేరతాయి.
- ఫాస్టాగ్తో పాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ) తదితరాలకూ ఇలాంటి వెసులుబాటు కల్పించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులు ప్రతిసారీ తమ కార్డుల్లో డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని, వారి ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుందని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన