Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం ₹4,265 కోట్లు
Kotak Mahindra Bank Q3 results: కోటక్ మహీంద్రా బ్యాంక్ మూడో త్రైమాసికంలో రూ.4,265 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ముంబయి: ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3 Results) బ్యాంక్ ఏకీకృత ప్రాతిపదికన 6.75 శాతం వృద్ధితో రూ.4,264.78 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.3,995.05 కోట్లుగా నమోదైంది.
స్టాండ్ లోన్ పద్ధతిలో కోటక్ మహీంద్రా లాభం (పన్నుల అనంతరం) రూ.3,005 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.2,791.88 కోట్లతో పోలిస్తే అధికం కాగా.. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,190.97 కోట్లతో పోలిస్తే తక్కువ. మొత్తం ఆదాయం సైతం రూ.10,947 కోట్ల నుంచి రూ.14,096 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఖర్చులు రూ.3,751 కోట్ల నుంచి రూ.4,284 కోట్లకు పెరిగాయి.
గతేడాది ఇదే త్రైమాసికంలో ప్రావిజన్లు రూ.149.83 కోట్లు కాగా.. ఈసారి ఆ మొత్తం రూ.578.14 కోట్లకు పెరిగింది. ఇది నికర లాభంపై ప్రభావం చూపింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.72 శాతం కాగా.. ఈసారి 1.73 శాతంగా నమోదైంది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల్లో (AIFs) ఇన్వెస్ట్మెంట్కు గానూ రూ.190.13 కోట్లు కేటాయించినట్లు బ్యాంక్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా