Krishna Ella: డాక్టర్ కృష్ణ ఎల్లకు ‘డీన్స్ మెడల్’ పురస్కారం
భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్ఠాత్మక డీన్స్ మెడల్ లభించింది. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది.
డాక్టర్ కృష్ణ ఎల్లకు డీన్స్ మెడల్ ప్రదానం చేస్తున్న జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ ఎల్లెన్ జె.మెకెంజీ
ఈనాడు, హైదరాబాద్: భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్ఠాత్మక డీన్స్ మెడల్ లభించింది. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ నెల 22న మేరీల్యాండ్లోని బాల్టిమోర్లో నిర్వహించిన బ్లూమ్బెర్గ్ స్కూల్ కాన్వకేషన్లో డాక్టర్ కృష్ణ ఎల్లకు డీన్స్ మెడల్ అందించారు. భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి లభించిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ మెడల్ను భారతదేశానికి, ఇక్కడి శాస్త్రవేత్తలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్ కృష్ణ ఎల్ల సారథ్యంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, బయోటెక్నాలజీ రంగంలో, టీకాల ఆవిష్కరణలో అత్యంత క్రియాశీలక సంస్థగా ఎదిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన టైఫాయిడ్ కంజుగేట్ టీకా- టైప్బార్ టీసీవీ, రొటావైరస్ టీకా- రొటావ్యాక్, జపనీస్ ఎన్సెఫలైటిస్ టీకా- జెన్వ్యాక్ తో పాటు 19 టీకాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. వివిధ దేశాలకు ఇప్పటి వరకూ 900 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసింది. అన్నింటికంటే మించి కొవిడ్-19 ముప్పును ఎదుర్కోడానికి ఈ సంస్థ కొవాగ్జిన్ టీకాను అతి తక్కువ సమయంలో తీసుకువచ్చింది. ఈ టీకాను మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వినియోగించారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, కలరా, మలేరియా, టీబీ, చికున్గున్యా, జికా.. తదితర వ్యాధులకు టీకాలు ఆవిష్కరించే పనిలో ఉంది. ఈ సంస్థకు 145 పేటెంట్లు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?