Mahindra: మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు

మహీంద్రా గ్రూప్‌ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.

Published : 17 May 2024 04:05 IST

2030కి మరో 23 కొత్త వాహనాలు

దిల్లీ: మహీంద్రా గ్రూప్‌ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. కొత్త ఐసీఈ (ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌) ఎస్‌యూవీలు, బీఈవీలు (బ్యాటరీ విద్యుత్‌ వాహనాలు), తేలికపాటి వాణిజ్య వాహనాల ఆవిష్కరణకు ఈ పెట్టుబడులు పెట్టబోతోంది. 23 కొత్త వాహనాల్లో 9 ఐసీఈ ఎస్‌యూవీలు, 7 బీఈవీలు, 7 తేలికపాటి వాణిజ్య వాహనాలు ఉంటాయని సమాచారం. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా తయారీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, హైబ్రిడ్‌ వాహనాల ఆవిష్కరణతో పాటు భవిష్యత్‌ ధోరణులకు అనుగుణంగా మారడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. భారత కొత్త ఈవీ విధానాన్ని సంస్థ స్వాగతించింది.

ఎం అండ్‌ ఎం లాభం రూ.2,754 కోట్లు

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో  రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.2,637 కోట్లతో పోలిస్తే ఇది 4% ఎక్కువ. ఆదాయం రూ.32,456 కోట్ల నుంచి 9% పెరిగి రూ.35,452 కోట్లకు చేరింది.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.11,269 కోట్లకు చేరింది. 2022-23 నాటి రూ.9,025 కోట్లతో పోలిస్తే, ఇది 25% అధికం. ఆదాయం     రూ.1,21,362 కోట్ల నుంచి 15% పెరిగి రూ.1,39,078 కోట్లకు చేరింది.
  • ‘మా వ్యాపారాలు మంచి పని తీరు ప్రదర్శించడంతో అద్భుతమైన ఏడాదిని చూశాం. వాహన విభాగం అధిక వృద్ధి నమోదు చేసింది. వ్యవసాయ విభాగమూ మంచి వాటా పొందింది. మహీంద్రా ఫైనాన్స్‌ ఆస్తుల నాణ్యత పెరిగింద’ని ఎం అండ్‌ ఎం ఎండీ, సీఈఓ అనీశ్‌ షా వెల్లడించారు.
  • రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.21.10 (422%) చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు