UPI: ఇకపై సింగపూర్ నుంచి యూపీఐ ద్వారా రెమిటెన్స్ చెల్లింపులు
సింగపూర్ నుంచి భారతీయులు యూపీఐ ద్వారా రెమిటెన్స్ చెల్లింపులు చేయొచ్చని ఎన్పీసీఐ తెలిపింది.
దిల్లీ: సింగపూర్లో ఉంటున్న భారతీయులు ఇకపై యూపీఐ (UPI), బ్యాంకింగ్ యాప్ల ద్వారా నేరుగా తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయొచ్చని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భీమ్, ఫోన్పే, పేటీఎం యూజర్లతోపాటు ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, డీబీఎస్ బ్యాంకుల ఖాతాదారులు రెమిటెన్స్ (విదేశంలో ఉంటున్న వారు స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులకు పంపే నగదు) చెల్లింపులు చేయొచ్చు. త్వరలో మరిన్ని బ్యాంకింగ్ యాప్లలో ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్పీసీఐ తెలిపింది.
‘‘నూతనంగా తీసుకొచ్చిన ఈ విధానంతో సింగపూర్లోని భారతీయులు క్షణాల్లో తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయొచ్చు. ఇది పూర్తిగా సురక్షితమైన విధానం. లావాదేవీల రుసుము కూడా తక్కువే. 365 రోజుల్లో ఎప్పుడైనా డబ్బు పంపొచ్చు’’ అని ఎన్పీసీఐ పేర్కొంది. దేశీయంగా రూపొందించిన యూపీఐ పద్ధతిలో ఇతర దేశాలకు డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం భారత ఆర్థిక వ్యవస్థ పరిధిని మరింత విస్తరింపచేస్తుందని ఎన్పీసీఐ ఆశాభావం వ్యక్తంచేసింది.
భారత్-సింగపూర్ల మధ్య డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసే అనుసంధాన ప్రక్రియను గతేడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన యూపీఐ, సింగపూర్కు చెందిన పేనౌలను అనుసంధానించారు. తొలి విడతలో కేవలం వాణిజ్యపరమైన లావాదేవీలకు మాత్రమే అనుమతి ఉండేది. తాజాగా సాధారణ ఖాతాలకు నగదు బదిలీ చేసేందుకు అనుమతించారు. ప్రస్తుతం ఒక రోజులో రూ.60 వేల నగదు (వెయ్యి సింగపూర్ డాలర్లు) పంపొచ్చు. యూపీఐ ద్వారా సింగపూర్లో ఉన్న వారికి నగదు పంపాలంటే.. పేనౌకు అనుసంధానించిన ఫోన్ నంబర్ ఎంటర్ చేసి డబ్బు పంపొచ్చు. అలాగే, సింగపూర్ నుంచి భారత్కు బదిలీ చేయాలంటే.. పేనౌ యాప్లో యూపీఐ ఐడీ టైప్ చేసి నగదు బదిలీ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.