Treaty of Russia: మన దేశంలో ఎస్జే-100 విమానాల తయారీ
హెచ్ఏఎల్తో రష్యా ఒప్పందం

దిల్లీ: మనదేశంలోనూ ప్రయాణికుల విమానాలు తయారీ చేయాలన్న ఆకాంక్ష నెరవేరేందుకు మార్గం సుగమం అయ్యింది. తక్కువ దూరం ప్రయాణాలకు ఉపయోగపడే, 2 ఇంజిన్ల న్యారోబాడీ ఎస్జే-100 విమానాలను తయారు చేసే రష్యా కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్సీ-యూఏసీ)తో మన ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) ఒప్పందం కుదుర్చుకోవడం ఇందుకు నేపథ్యం. ఈ ఒప్పందం ప్రకారం ఎస్జే-100 విమానాలను మనదేశంలోనూ తయారు చేస్తారు. ఇప్పటివరకు ఈ మోడల్ విమానాలు 200 తయారవ్వగా, 16 విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. భారత్లో ప్రయాణికుల కోసం ఈ విమానాలను తయారు చేసే హక్కులు హెచ్ఏఎల్కు లభిస్తున్నాయి. ‘దేశంలో ఎస్జే-100 విమానాల తయారీ భారత విమానయాన పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. రానున్న పదేళ్లలో ప్రాంతీయ అనుసంధానత పథకం (ఉడాన్) కింద ఎస్జే-100 వంటి చిన్న పరిమాణం కలిగిన 200 విమానాలు అవసరమవుతాయని భావిస్తున్నాం. హిందూ మహాసముద్ర ప్రాంత పర్యాటక ప్రదేశాలకు సేవలందించేందుకు మరో 350కు పైగా విమానాలు అవసరం. పౌర విమానయాన రంగంలో మనదేశం ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుంది’ అని హెచ్ఏఎల్ పేర్కొంది. 103 మంది వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ విమానం.. స్వల్ప దూర గమ్యాలకు అనువుగా ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. మాస్కోలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్, పీజేఎస్సీ-యూఏసీ డైరెక్టర్ జనరల్ వాది బదేఖా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్యాదవ్ కౌంటర్ దాఖలు
 - 
                        
                            

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 


