Mark Zuckerberg: గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం.
వాషింగ్టన్: కృత్రిమ మేధ (Artificial intelligence - AI) టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీకి ఉండే ఆదరణ అంతాఇంతా కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. సర్వం ఏఐమయమౌతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో టెక్ కంపెనీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఏఐ ఆధారిత ఉత్పత్తుల రూపకల్పనకు సిద్ధమయ్యాయి. డిమాండ్కు తగిన స్థాయిలో నిపుణుల సరఫరా లేకపోవటం తలనొప్పిగా మారింది. ఈనేపథ్యంలో ఇతర కంపెనీల్లోని ప్రొఫెషనల్స్కు గాలం వేస్తున్నాయి.
తాజాగా ఫేస్బుక్, వాట్సప్ మాతృసంస్థ మెటా (Meta) సైతం ఇతర కంపెనీల్లోని ఏఐ నిపుణులను ఆకర్షించే పనిలో పడిందని వార్తలు వస్తున్నాయి. స్వయంగా కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) పలువురికి వ్యక్తిగతంగా ఈమెయిల్స్ పంపుతున్నట్లు సమాచారం. గూగుల్లో (Google) కృత్రిమ మేధ విభాగం డీప్మైండ్లో పనిచేస్తున్న కీలక ప్రొఫెషనల్స్ను సైతం ఆయన సంప్రదించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే వేతనం, ఇతరత్రా ప్రోత్సాహకాలపై ఆయన వారికి హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
మెటా తమ ఏఐ కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. తమ ప్లాట్ఫామ్లో వీడియో రికమండేషన్లను పూర్తిగా ఏఐతో అనుసంధానం చేయాలనుకుంటున్నట్లు చెప్పాయి. కేవలం రీల్స్ మాత్రమే కాకుండా మొత్తం వీడియోలకు ఒకే ఏఐ మోడల్ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇటీవల ఫేస్బుక్ హెడ్ టామ్ అలిసన్ వెల్లడించారు. దీనికే రికమండేషన్ వ్యవస్థను సైతం అనుసంధానిస్తామని తెలిపారు. తద్వారా యూజర్ల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ను అందించడంతో పాటు ప్లాట్ఫామ్ స్పందన సైతం మెరుగవుతుందని వివరించారు.
ఇప్పటికే రీల్స్, గ్రూప్స్, ఫీడ్ వంటి ఫీచర్ల కోసం మెటా వివిధ రకాల ఏఐ మోడల్స్ను ఉపయోగిస్తోంది. వీటన్నింటిలో రికమండేషన్లను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడంలో భాగంగా ఇటీవల అత్యాధునిక ఏఐ మోడల్స్ను పరీక్షిస్తోంది. కానీ, మెటాను కంప్యూటర్ చిప్ల కొరత వేధిస్తోంది. 2023లో 4.5 బిలియన్ డాలర్లు వెచ్చించి ఎన్వీడియా నుంచి హెచ్100 చిప్లను కొనుగోలు చేసింది. ఇటీవల బీ200 చిప్ విడుదలైన నేపథ్యంలో వీటినీ సమకూర్చుకునే యత్నాల్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో