Stock Market: దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. ₹400 లక్షల కోట్లు దాటిన మదుపర్ల సంపద
Stock Market: సెన్సెక్స్-30 సూచీ 500 పాయింట్లకు పైగా పుంజుకొని 74,751 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ సైతం 22,658 దగ్గర తాజా రికార్డును నమోదు చేసింది.
దిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆశావహ సంకేతాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడుల దన్నుతో మార్కెట్లు రాణిస్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్-30 సూచీ దాదాపు 500 పాయింట్లు పుంజుకొని 74,751 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ సైతం 22,658 దగ్గర తాజా రికార్డును నమోదు చేసింది.
మధ్యాహ్నం 12:18 గంటల సమయంలో సెన్సెక్స్ 486 పాయింట్లు పుంజుకొని 74,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 22,657 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో మారుతీ, ఎం అండ్ ఎం, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సూచీల ర్యాలీ నేపథ్యంలో మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్ను దాటింది. గత జులైలో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.300 లక్షల కోట్లు తాకింది. అమెరికా మార్కెట్లు గతవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో మార్కెట్లు రాణిస్తుండడం గమనార్హం.
బంధన్ బ్యాంక్ షేర్లు డీలా..
ప్రైవేట్రంగ బంధన్ బ్యాంక్ షేర్లు సోమవారం ఆరంభంలో 9 శాతానికి పైగా కుంగి రూ.179 దగ్గర ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. ఎండీ, సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ పదవీకాలం జులై 9తో ముగియనుందని.. ఆ తర్వాత ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని బ్యాంక్ తెలిపింది. తొమ్మిదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ఆయన సంస్థలో మరింత వ్యూహాత్మక పాత్రను పోషించనున్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.