Stock Market: దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. ₹400 లక్షల కోట్లు దాటిన మదుపర్ల సంపద
Stock Market: సెన్సెక్స్-30 సూచీ 500 పాయింట్లకు పైగా పుంజుకొని 74,751 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ సైతం 22,658 దగ్గర తాజా రికార్డును నమోదు చేసింది.
దిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆశావహ సంకేతాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడుల దన్నుతో మార్కెట్లు రాణిస్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్-30 సూచీ దాదాపు 500 పాయింట్లు పుంజుకొని 74,751 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ సైతం 22,658 దగ్గర తాజా రికార్డును నమోదు చేసింది.
మధ్యాహ్నం 12:18 గంటల సమయంలో సెన్సెక్స్ 486 పాయింట్లు పుంజుకొని 74,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 22,657 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో మారుతీ, ఎం అండ్ ఎం, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సూచీల ర్యాలీ నేపథ్యంలో మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్ను దాటింది. గత జులైలో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.300 లక్షల కోట్లు తాకింది. అమెరికా మార్కెట్లు గతవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో మార్కెట్లు రాణిస్తుండడం గమనార్హం.
బంధన్ బ్యాంక్ షేర్లు డీలా..
ప్రైవేట్రంగ బంధన్ బ్యాంక్ షేర్లు సోమవారం ఆరంభంలో 9 శాతానికి పైగా కుంగి రూ.179 దగ్గర ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. ఎండీ, సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ పదవీకాలం జులై 9తో ముగియనుందని.. ఆ తర్వాత ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని బ్యాంక్ తెలిపింది. తొమ్మిదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ఆయన సంస్థలో మరింత వ్యూహాత్మక పాత్రను పోషించనున్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్