Kohans Life sciences: కొహాన్స్ లైఫ్ సైన్సెస్తో సువెన్ ఫార్మా విలీనం
కొహాన్స్ లైఫ్ సైన్సెస్తో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విలీనానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు అనుమతి ఇచ్చినట్లు సువెన్ ఫార్మా గురువారం వెల్లడించింది.
స్టాక్ ఎక్స్ఛేంజీల అనుమతి
ఈనాడు, హైదరాబాద్: కొహాన్స్ లైఫ్ సైన్సెస్తో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విలీనానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు అనుమతి ఇచ్చినట్లు సువెన్ ఫార్మా గురువారం వెల్లడించింది. ఇక సెబీ అనుమతి రావడమే మిగిలి ఉంది. ఆ తర్వాత ఎన్సీఎల్టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్)లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ వచ్చే 12 - 15 నెలల్లో పూర్తవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. తద్వారా మలిదశ వృద్ధి వ్యూహాలను వేగంగా అమలు చేసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. వచ్చే అయిదేళ్లలో ఆదాయాలు రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సువెన్ ఫార్మా నిర్దేశించుకుంది. దీనికి కొహాన్స్ లైఫ్సైన్సెస్తో విలీనం దోహదపడుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ప్రొవిజన్ల కంటే ముందు ఆదాయం) పెరుగుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేగవంత వృద్ధి ఉంటుందని సువెన్ ఫార్మా ఎండీ డాక్టర్ వి.ప్రసాద రాజు తెలిపారు. ‘చైనా ప్లస్ వన్’ విధానాన్ని వివిధ దేశాలు అనుసరిస్తున్నందున, తమకు వ్యాపారావకాశాలు పెరుగుతున్నాయని అన్నారు.
తగ్గిన లాభాలు: సువెన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.252.9 కోట్ల ఆదాయాన్ని, రూ.62.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.369.4 కోట్లు, నికరలాభం రూ.124 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 32%, నికరలాభం 50% తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఈ సంస్థ రూ.1,051 కోట్ల ఆదాయాన్ని, రూ.319 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.1,340 కోట్లు, నికరలాభం రూ.401 కోట్లు ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే ఆదాయం 21.6%, నికరలాభం 20.4% తగ్గాయి. కొవిడ్ మందుల అమ్మకాలు తగ్గడం, ‘షిప్మెంట్’ జాప్యం దీనికి ప్రధాన కారణాలని సువెన్ ఫార్మా యాజమాన్యం వివరించింది.
పరిశోధన- అభివృద్ధి కేంద్రం: జీనోమ్ వ్యాలీలో నూతన పరిశోధన- అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించినట్లు యాజమాన్యం వెల్లడించింది. సూర్యాపేట యూనిట్లో కొత్త బ్లాకు ప్రారంభానికి సిద్ధం అవుతున్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం