Women: ట్రెండ్ మారుతోంది.. మహిళల పెట్టుబడి ప్రాధాన్యం బంగారం కాదట..!
రియల్ ఎస్టేట్(Real Estate)లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో 83 శాతం మంది మహిళలు (Women) నగరాల్లో ఇంటి కొనుగోలుకు మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైంది.
దిల్లీ: మహిళల్లో(Women) చాలా మంది బంగారాన్ని (Gold) సంప్రదాయమైన పెట్టుబడి (Investment)గా భావిస్తారు. అందుకే పండుగలు, శుభకార్యాలు వంటి సందర్భాల్లో బంగారాన్నికొనుగోలు చేస్తుంటారు. భారత్లో ఈ ధోరణి ఎక్కువ. అయితే, ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. మహిళలు బంగారానికి బదులు రియల్ ఎస్టేట్(Real Estate)లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. తాజాగా అనరాక్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన కన్జ్యూమర్ సర్వేలో ఎక్కువ మంది మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సర్వేలోపాల్గొన్న వారిలో 65 శాతం మంది పెట్టుబడి కోసం రియల్ ఎస్టేట్ తమ మొదటి ఎంపికగా చెప్పినట్లు సంస్థ నివేదికలో పేర్కొంది. మరో 20 శాతం మంది స్టాక్ మార్కెట్ (Stock Market)పై, 8 శాతం మంది మాత్రమే బంగారం కొనుగోలుకు, మరో ఏడు శాతం మంది ఫిక్స్డ్ డిపాజిల (Fixed Deposits)పై ఆసక్తి ఉందని వెల్లడించారు.
రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో 83 శాతం మంది మహిళలు నగరాల్లో ఇంటి కొనుగోలుకు మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైంది. వీరిలో 36 శాతం మంది రూ. 45 లక్షల నుంచి రూ. 90 లక్షల బడ్జెట్లో, 27 శాతం మంది రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్లు బడ్జెట్, 20 శాతం మంది రూ. 1.5 కోట్లు కన్నా ఎక్కువ బడ్జెట్లో ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు నివేదికలో పేర్కొంది.
‘‘గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో మహిళా కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నగరాల్లో పెద్ద ఇళ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. మిలినియల్స్ తరహాలో మహిళలు కూడా తమకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేసే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడంలేదు. మహిళల పేరుతో ఇళ్లు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) ద్వారా లబ్ది చేకూరుతుండటం మరో కారణం. అంతేకాకుండా బ్యాంకులు పురుషులతో పోలిస్తే మహిళలకు ఎక్కువ రాయితీతో రుణాలు అందిస్తున్నాయి. ఉద్యోగం చేసే మహిళలకు పన్ను చెల్లింపుల సమయంలో భర్తతోపాటు పన్ను రాయితీ లభిస్తుందనే ఉద్దేశంతో వారిని మరో యజమానిగా చూపిస్తూ ఇంటిని కొనుగోలు చేస్తున్నారు’’ అని అనరాక్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి వోచర్లను తీసుకురావడంపై టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ (TRAI) పరిశీలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM