Elon Musk: మస్క్ మనసులో బ్యాంక్.. ‘ఎక్స్’ ఉద్యోగులకు టార్గెట్!
Elon Musk: సామాజిక మాధ్యమం ‘ఎక్స్’పై ఎలాన్ మస్క్ తన భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. కంపెనీని సొంతం చేసుకొని ఏడాది గడిచిన సందర్భంగా ఉద్యోగులతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు.
Elon Musk | కాలిఫోర్నియా: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్.. బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) చేతికి వెళ్లి ఏడాది గడుస్తోంది. ఈ సంవత్సర కాలంలో పేరుతో సహా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేక మార్పులకు లోనైంది. ప్రీమియం ఫీచర్లు, వెరిఫికేషన్ బ్యాడ్జ్లు ఇలా చాలా రకాలుగా ఈ మెసేజింగ్ యాప్ (X) రూపాంతరం చెందింది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ మార్పులు రాబోతున్నట్లు తాజాగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ మస్క్ (Elon Musk) వెల్లడించారు. పూర్తిగా ‘ఎక్స్ (X)’ స్వరూపమే మారనుందని తన భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు.
దాదాపు ఒక బ్యాంక్కు సమానంగా ఎక్స్ (X)ను తీర్చిదిద్దనున్నట్లు మస్క్ (Elon Musk) తన ప్లాన్స్ను బయటపెట్టారు. ఒక పూర్తి స్థాయి ఆర్థిక కేంద్రంగా ఈ యాప్ను మార్చనున్నట్లు తెలిపారు. ఆర్థికం అంటే కేవలం ఆన్లైన్ లావాదేవీలు, చెల్లింపులు మాత్రమే కాదన్నారు. ఒక మనిషి ఆర్థిక జీవితం మొత్తానికి ఎక్స్ (X)ను అడ్డాగా మార్చాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. డబ్బులు, సెక్యూరిటీలు.. ఇలా దేనికైనా తమ యాప్ కేంద్రంగా మారాలని అన్నారు. అసలు బ్యాంక్ ఖాతానే అవసరం లేకుండా మనిషి జీవితంలో ఎక్స్ (X) భాగమై పోవాలని తన ఆలోచనలను ఆవిష్కరించారు. ఈ క్రమంలో 2024 ముగిసే నాటికి అనేక మార్పులు రాబోతున్నట్లు మస్క్ (Elon Musk) తెలిపారు. పరోక్షంగా ఉద్యోగులకు తదుపరి లక్ష్యాలను కూడా నిర్దేశించారు.
అలాగే రానున్న రోజుల్లో యూట్యూబ్, లింక్డిన్ వంటి వాటికి కూడా ఎక్స్ (X) పోటీనిస్తుందని మస్క్ (Elon Musk) అన్నట్లు కంపెనీకి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ‘ఎక్స్వైర్’ పేరిట న్యూస్ వైర్ సర్వీసులను సైతం ప్రారంభించే యోచనలో ఉన్నామని చెప్పినట్లు సమాచారం. చైనాలోని ‘వీచాట్’ సూపర్యాప్ తరహాలో ‘ఎక్స్’ను సైతం ఒక ‘ఎవ్రీథింగ్ యాప్’గా మారుస్తామని గతంలోనూ మస్క్ (Elon Musk) అనేక సార్లు సంకేతాలిచ్చారు. ఆన్లైన్ కొనుగోళ్లు, రవాణా, హోటల్ బుకింగ్లు.. ఇలా అన్నింటినీ ఎక్స్ (X)లో భాగం చేయనున్నట్లు చెప్పారు. ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు కావాల్సిన అనుమతుల కోసం ప్రస్తుతం అమెరికాలో కంపెనీ ప్రక్రియ ప్రారంభించింది.
ఎక్స్ (X)లో ఆడియో, వీడియో ఫీచర్ను తీసుకొచ్చినట్లు మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతానికి కొంతమంది యూజర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఫోన్ నెంబర్ అవసరం లేకుండా ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చని వివరించారు. ఎక్స్ (X)ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చడంలో భాగంగానే ఈ ఫీచర్ను ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ