నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
రూ.2,621 కోట్ల బకాయిల చెల్లింపు
త్రైమాసిక లాభం రూ.255.1 కోట్లు
వాటాదార్లకు 200% డివిడెండ్
ఈనాడు - హైదరాబాద్
అశ్విన్ దేవినేని
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి రూ.3,955 కోట్ల ఆదాయంపై రూ.1,256 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2022-23తో పోల్చితే వార్షిక లాభం 2.8% పెరిగింది. నవ లిమిటెడ్కు ఆఫ్రికాలోని అనుబంధ సంస్థ అయిన ఎంసీఎల్ (మాంబా కాలరీస్ లిమిటెడ్), గత ఆర్థిక సంవత్సరంలో 314.4 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,621 కోట్లు) దీర్ఘకాలిక రుణాన్ని పూర్తిగా చెల్లించింది. దీంతో నవ లిమిటెడ్ రుణ రహిత కంపెనీగా మారింది. తద్వారా భవిష్యత్తులో ఎంసీఎల్ నుంచి మాతృ సంస్థ అయిన నవ లిమిటెడ్కు లాభాలు జమ అయ్యే అవకాశం కలుగుతోంది. వాటాదార్లకు 200% డివిడెండ్ (రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.4 చొప్పున) చెల్లించాలని యాజమాన్యం ప్రతిపాదించింది.
మెరుగైన పనితీరు: నవ లిమిటెడ్ అనుబంధ సంస్థ, నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ పనితీరు మెరుగుపడింది. ఈ సంస్థకు చెందిన 150 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏడాది మొత్తం పనిచేసిన ఫలితంగా రూ.115 కోట్ల పీబీటీ (పన్నుకు ముందు లాభం) నమోదైంది. ఫెర్రో అల్లాయ్స్ విభాగమూ మార్చి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది. మైనింగ్ విభాగం ఆదాయాలు 21.2%, పీబీటీ 165% పెరిగాయి.
గనుల తవ్వకాలు.. అవకాడో పెంపకం: ఎంసీఎల్ తన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనుంది. రెండో దశలో 300 మెగావాట్ల ప్లాంట్ నిర్మించేందుకు అవసరమైన నిధుల సమీకరణ యత్నాలు చేపట్టింది. దీంతో పాటు జాంబియా సెంట్రల్ ప్రావిన్స్లో 323 హెక్టార్లలో మాగ్నటైట్ గని అభివృద్ధి చేసే అంశాన్ని ఎంసీఎల్ పరిశీలిస్తూ, గనుల తవ్వకం హక్కుల కోసం అక్కడ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. వచ్చే ఏడాది కాలంలో దీనికి సంబంధించిన వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసి, మైనింగ్ కార్యకలాపాలు చేపట్టాలని ఎంసీఎల్ భావిస్తోంది. మరొక అనుబంధ సంస్థ నవ అవకాడో లిమిటెడ్ దాదాపు 225 హెక్టార్లలో 75,000 అవకాడో మొక్కలు నాటింది. రెండు నెలల్లో మరో 20,000 మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్లాంటేషన్ నుంచి రెండేళ్లలో ఆదాయాలు వస్తాయని యాజమాన్యం ఆశిస్తోంది.
అన్ని విభాగాలు బాగున్నాయి: ఏకీకృత, స్టాండ్ అలోన్ స్థాయిలో పూర్తిగా అప్పు తీర్చేసి రుణ రహిత కంపెనీగా మారటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నట్లు నవ లిమిటెడ్ సీఈఓ అశ్విన్ దేవినేని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల గడువు ఉన్నప్పటికీ ముందే బకాయిలు తీర్చడం వల్ల, దీర్ఘకాలంలో సత్ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. సంస్థలోని అన్ని వ్యాపార విభాగాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి