Job Skills: ఏఐ తరంలోనూ ఇదే నెంబర్ 1 స్కిల్.. జాబ్లో చేరబోయేవారికి మిలియనీర్ సూచన
Job Skills: ఉద్యోగంలో చేరబోయేవారికి ఉండాల్సిన ఓ కీలక స్కిల్ను న్యూయార్క్లోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కాట్ గాల్లోవే వెల్లడించారు. అది ఎప్పటికీ కాలం చెల్లని నైపుణ్యమని వివరించారు. అదేంటో చూద్దాం..
వాషింగ్టన్: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI), మెషీన్ లెర్నింగ్, కోడింగ్.. ఇవే ఇప్పుడు జాబ్ మార్కెట్లో హాట్ టాపిక్. వీటిలో నైపుణ్యం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది. అయితే వీటి కంటే ముందు ఈ ఏఐ జనరేషన్లోనూ మరో స్కిల్ చాలా ప్రధానమని చెబుతున్నారు అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త. అదే స్టోరీ టెల్లింగ్.
న్యూయార్క్లోని ఓ యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్కాట్ గాల్లోవే ఓ కంపెనీని స్థాపించి దాన్ని 130 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించే వారికి స్టోరీ టెల్లింగ్ నైపుణ్యం చాలా కీలకమని తన అనుభవంలో తెలుసుకున్నట్లు చెప్పారు. పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడుతున్న ఈ రోజుల్లోనూ మనం అనుకున్నది అత్యంత ప్రభావవంతంగా చెప్పడం కీలకమని వివరించారు. తగిన సమాచారం, చిత్రాలు, ఇన్ఫోగ్రాఫిక్స్తో మన ఆలోచనలను వ్యక్తపర్చడం అవసరమన్నారు. కమ్యూనికేషన్ మాధ్యమాలు మారొచ్చేమో కానీ, చెప్పే విధానానికి మాత్రం ప్రాధాన్యం తగ్గదన్నారు. ఇది ఎప్పటికీ కాలం చెల్లని నైపుణ్యమని వివరించారు.
పూర్తిగా చాట్జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్పై ఆధారపడటం ప్రయోజనకరం కాదని స్కాట్ హెచ్చరించారు. ఏఐ, కోడింగ్ అత్యవసరమైనప్పటికీ.. స్టోరీ టెల్లింగ్ అత్యంత విలువైన నైపుణ్యమని వివరించారు. ఒక బ్రాండ్ ప్రతిష్ఠను పెంచడం, తగ్గించడం దీనిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఐదేళ్లలో చాట్జీపీటీ (ChatGPT) వంటి అత్యాధునిక టెక్నాలజీలు సైతం కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని తెలిపారు. న్యూరల్ నెట్వర్క్ వంటి టెక్నాలజీలు తెరపైకి రావొచ్చని అంచనా వేశారు. అప్పుడు కోడింగ్కు ప్రాధాన్యం ఉండదన్నారు. ఆ వేళ కూడా స్టోరీ టెల్లింగే కీలక నైపుణ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదే సక్సెస్ సూత్రం..
ఎంచుకున్న రంగంలో నైపుణ్యం సాధించడమే సక్సెస్ సూత్రమని స్కాట్ వివరించారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా.. చేసే పనిపై పట్టు సాధించడమే విజయానికి నమ్మకమైన దారి అని తెలిపారు. ‘‘ఒక రంగాన్ని ఎంచుకోండి. అది ఎంత చిన్నదైనా ఫర్వాలేదు. గట్టిగా ప్రయత్నించండి. దానిపై పట్టు సాధించండి. ఆ డొమైన్లో వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించండి. దేన్నైనా ఎంజాయ్ చేయాలి. లేదంటే నైపుణ్యం సాధించడం కష్టం’’ అని స్కాట్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!