హర్ సర్కిల్ ప్రాజెక్ట్ ప్రారంభించిన నీతా అంబానీ
Nita ambani: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త కార్యక్రమాన్ని నీతా అంబానీ ప్రారంభించారు. అందరి మహిళలనూ సమానంగా చూడడం దీని ఉద్దేశం.
ముంబయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘హర్ సర్కిల్ ఎవ్రిబడీ’ (Her Circle, EveryBODY ) పేరిట కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించారు. వయసు, రంగు, మతం, శరీరతత్వం వంటి భౌతిక వివక్షకు తావు లేకుండా అందరి మహిళల్ని సమానంగా చూడాలన్నదే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. మహిళల కోసం 2021లో ప్రత్యేకంగా హర్ సర్కిల్ సోషల్మీడియాను నీతా అంబానీ ప్రారంభించారు. ఈ ప్లాట్ఫాం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో సమాజంలో సానుకూల మార్పు తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్లో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నీతా అంబానీ పిలుపునిచ్చారు.
హర్ సర్కిల్ గురించి నీతా అంబానీ మాట్లాడుతూ.. అందరినీ సమానంగా చూడాలన్నదే కొత్త ప్రాజెక్ట్ ఉద్దేశమని తెలిపారు. చాలా మంది సోషల్ మీడియాలో ట్రోలింగ్కు, అవమానాలకు గురవ్వడం చూస్తున్నాం అని చెప్పారు. వారు ఎలాంటి వైద్య సమస్యలతో బాధపడుతుంటారో, జన్యు పరమైన ఇబ్బందులతో సతమతమవుతుంటారో తెలీకుండా తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తుంటారు. దీనివల్ల యువ హృదయాలు బాధపడుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో ఓ విధంగా తమ ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని తెలిపారు. ట్రోలింగ్కు గురయ్యేవారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకూ ఉపయోగపడుతుందన్నారు.
సోషల్ మీడియా ద్వారా మహిళలకు సంబంధించిన కంటెంట్ను అందించడమే లక్ష్యంగా హెర్ సర్కిల్ను 2021లో ప్రారంభించారు. ఇందులో వెల్నెస్, ఫైనాన్స్, పర్సనల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ సర్వీస్, బ్యూటీ, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ సహా అనేక రకాల విషయాలపై వీడియోలను అందిస్తుంటారు. కథనాలనూ ఇస్తుంటారు. స్వచ్ఛంద సంస్థలు, మహిళలు నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లోనూ ఇందులోని సభ్యులు పాల్గొనొచ్చు. హర్ సర్కిల్లో ఆంగ్ల, హిందీ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో హర్ సర్కిల్ను ప్రారంభించామని నీతా అంబానీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రెండేళ్ల కాలంలో చాలా ముందుకొచ్చామని, అయినా ఇది ప్రారంభం మాత్రమేనని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్