OPS: పాత పెన్షన్ స్కీం పునరుద్ధరణపై నీతి ఆయోగ్ ఆందోళన!
కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కొత్త పెన్షన్ పథకం నుంచి పాత పెన్షన్ విధానంలోకి మారాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఇది భవిష్యత్తు ప్రభుత్వాలు, పౌరులపై భారం మోపుతుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీ: పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరణపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్తు పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని తెలిపారు. ఆర్థిక పరిపుష్టి, సుస్థిర వృద్ధిరేటును సాధించాల్సిన ఈ తరుణంలో ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు అంతగా మంచి చేయవని హితవు పలికారు.
ఓపీఎస్లో పింఛను మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించేది. దీన్ని 2003లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి కొత్త పింఛను పథకాన్ని (NPS) అమల్లోకి తీసుకొచ్చింది. దీంట్లో ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 10 శాతం పింఛను కింద జమచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు తమ వంతుగా 14 శాతం ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓపీఎస్ను అమలు చేయాలని నిర్ణయించాయి. హిమాచల్ప్రదేశ్లో అధికారంలో ఉన్న భాజపా రానున్న ఎన్నికల్లో గెలిస్తే ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఝార్ఖండ్ సైతం ఓపీఎస్ పద్ధతిలోకి మారాలని ఇటీవలే నిర్ణయించింది. మరోవైపు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సైతం పాత పింఛను విధానంలోకి మారనున్నట్లు ప్రకటించింది.
దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సిన అవసరం ఉందని బేరీ సూచించారు. పాత పింఛను పథకం వల్ల ప్రస్తుతానికి ప్రభుత్వాలు లాభపడినప్పటికీ.. భవిష్యత్తుల్లో రాబోయే ప్రభుత్వాలతో పాటు పౌరులు సైతం పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు దీన్ని గ్రహించి ముందే అప్రమత్తం కావాల్సిన అసవరం ఉందన్నారు.
మరోవైపు అధికారిక ‘దారిద్య్ర రేఖ ( poverty line)’ను నీతి ఆయోగ్ ఎప్పుడు నిర్ణయిస్తుందని బేరీని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఐరాస అభివృద్ధి పథకం విడుదల చేస్తున్న ‘బహుముఖ పేదరిక సూచీ (MPI)’తో తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపారు. పౌష్టికాహారం, విద్య, జీవనప్రమాణాలు సహా మొత్తం 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని మదింపు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘వినియోగదారుల వ్యయ సర్వే’ ఫలితాలు వచ్చిన తర్వాతే కొత్త దారిద్య్ర రేఖను నిర్ణయించగలమని తెలిపారు. అది కేంద్ర గణాంకశాఖ వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!