Adani Group: ‘అదానీ’పై విచారణకు ప్రభుత్వ కమిటీ ఏమీ లేదు: కేంద్రం
Adani Group: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేని ప్రభుత్వం తెలిపింది.
దిల్లీ: అదానీ గ్రూప్ (Adani Group)పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు. అలాగే అదానీ కంపెనీ ఇండోనేషియా నుంచి చేసుకుంటున్న బొగ్గు దిగుమతిపై కొనసాగుతున్న విచారణ ఇంకా ముగియలేదని వెల్లడించారు. లోక్సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సోమవారం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అదానీ గ్రూప్ (Adani Group)లోని తొమ్మిది నమోదిత సంస్థల మార్కెట్ విలువ 2023 జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య 60 శాతం కుంగినట్లు మరో ప్రశ్నకు బదులిస్తూ పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడడంతో పాటు మార్కెట్లో స్థిరత్వం వచ్చేలా నియంత్రణా సంస్థ సెబీ చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. అవసరమైతే విచారణ కూడా జరిపే అధికారం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్ (Adani Group)పై దర్యాప్తు ప్రారంభించిందన్నారు.
మరోవైపు అదానీ (Adani Group) కంపెనీ దిగుమతి చేసుకుంటున్న విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరికరాల వ్యవహారంపై డీఆర్ఐ జరిపిన విచారణ ముగిసిందని మంత్రి తెలిపారు. నివేదికను సంబంధించిన న్యాయ అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు. అలాగే అదానీ షేర్లలోని ఒడుదొడుకుల వల్ల స్థూలంగా మార్కెట్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. నిఫ్టీ 50 సూచీ గత రెండు నెలల వ్యవధిలో 4.9 శాతం కుంగినట్లు గుర్తుచేశారు.
ప్రభుత్వ ఆధీనంలోని ఎల్ఐసీకి అదానీ గ్రూప్ (Adani Group) 2023 మార్చి 5 నాటికి రూ.6,182.64 కోట్ల రుణాలు బకాయి పడిందని పంకజ్ చౌదరి తెలిపారు. మరోవైపు అదానీ సంస్థలకు తాము ఎలాంటి రుణాలు ఇవ్వలేదని ఐదు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకులు ఆయా కంపెనీల పనితీరు, ప్రాజెక్టుల అమలు, రిస్క్ను అంచనా వేసిన తర్వాతే రుణాలు మంజూరు చేశాయని తెలిపారు.
అదానీ -హిండెన్బర్గ్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఇటీవల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్ల పతనంతో సహా స్టాక్ మార్కెట్లలో రెగ్యులేటరీ అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వం వహిస్తారు. కేంద్రం సమర్పించిన నిపుణల కమిటీ ప్రతిపాదనను తిరస్కరించిన సుప్రీం.. ఆ కమిటీని తామే నియమిస్తామని గత విచారణలో వెల్లడించింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..