Adani Group: ‘అదానీ’పై విచారణకు ప్రభుత్వ కమిటీ ఏమీ లేదు: కేంద్రం
Adani Group: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేని ప్రభుత్వం తెలిపింది.
దిల్లీ: అదానీ గ్రూప్ (Adani Group)పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు. అలాగే అదానీ కంపెనీ ఇండోనేషియా నుంచి చేసుకుంటున్న బొగ్గు దిగుమతిపై కొనసాగుతున్న విచారణ ఇంకా ముగియలేదని వెల్లడించారు. లోక్సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సోమవారం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అదానీ గ్రూప్ (Adani Group)లోని తొమ్మిది నమోదిత సంస్థల మార్కెట్ విలువ 2023 జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య 60 శాతం కుంగినట్లు మరో ప్రశ్నకు బదులిస్తూ పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడడంతో పాటు మార్కెట్లో స్థిరత్వం వచ్చేలా నియంత్రణా సంస్థ సెబీ చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. అవసరమైతే విచారణ కూడా జరిపే అధికారం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్ (Adani Group)పై దర్యాప్తు ప్రారంభించిందన్నారు.
మరోవైపు అదానీ (Adani Group) కంపెనీ దిగుమతి చేసుకుంటున్న విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరికరాల వ్యవహారంపై డీఆర్ఐ జరిపిన విచారణ ముగిసిందని మంత్రి తెలిపారు. నివేదికను సంబంధించిన న్యాయ అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు. అలాగే అదానీ షేర్లలోని ఒడుదొడుకుల వల్ల స్థూలంగా మార్కెట్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. నిఫ్టీ 50 సూచీ గత రెండు నెలల వ్యవధిలో 4.9 శాతం కుంగినట్లు గుర్తుచేశారు.
ప్రభుత్వ ఆధీనంలోని ఎల్ఐసీకి అదానీ గ్రూప్ (Adani Group) 2023 మార్చి 5 నాటికి రూ.6,182.64 కోట్ల రుణాలు బకాయి పడిందని పంకజ్ చౌదరి తెలిపారు. మరోవైపు అదానీ సంస్థలకు తాము ఎలాంటి రుణాలు ఇవ్వలేదని ఐదు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకులు ఆయా కంపెనీల పనితీరు, ప్రాజెక్టుల అమలు, రిస్క్ను అంచనా వేసిన తర్వాతే రుణాలు మంజూరు చేశాయని తెలిపారు.
అదానీ -హిండెన్బర్గ్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఇటీవల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్ల పతనంతో సహా స్టాక్ మార్కెట్లలో రెగ్యులేటరీ అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వం వహిస్తారు. కేంద్రం సమర్పించిన నిపుణల కమిటీ ప్రతిపాదనను తిరస్కరించిన సుప్రీం.. ఆ కమిటీని తామే నియమిస్తామని గత విచారణలో వెల్లడించింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
నగదుంటేనే రైడ్ రైట్
-
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్