OYO CEO: ఘనంగా ఓయో సీఈవో వివాహం.. కొత్త జంటకు కేంద్రమంత్రి విషెష్..
ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితీశ్ ఒక ఇంటివాడయ్యారు. గీతాన్హా సూద్తో ఆయన వివాహం ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటను విష్ చేసిన ఫొటోలను కేంద్రమంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ ట్విట్ చేశారు.
దిల్లీ: ఆతిథ్య సేవలందించే ఓయో (OYO) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రితేశ్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం ఘనంగా జరిగింది. రితేశ్ అగర్వాల్- గీతాన్షా సూద్ జంటను కలిసిన కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వారికి శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు. మరోవైపు, రీతేశ్-గీతాన్షా సూద్ వివాహ రిసెప్షన్ దిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరగనుంది. వివాహ రిసెప్షన్కు ప్రధాని నరేంద్ర మోదీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఇతర రాజకీయ, వాణిజ్యరంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈ కొత్త జంటను కలిసి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫొటోలను ప్రహ్లాద్ సింగ్పటేల్ ట్వీట్ చేశారు. దీనిపై రితేశ్ రిప్లయ్ ఇచ్చారు. ‘మీ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు..’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ పెళ్లికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, రితేశ్ జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదు.
రితేశ్ ఆస్తుల విలువ తెలుసా?
ఒడిశాలోని రాయగఢలో మార్వారీ కుటుంబంలో జన్మించిన రితేశ్ అగర్వాల్.. 2013లో ఓయోను స్థాపించి సక్సెస్ అయ్యారు. తక్కువ కాలంలోనే బిలియనీర్గా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. గతంలో ఆయన కుటుంబం దక్షిణ ఒడిశాలోని రాయగఢ్ నగరంలో చిన్న దుకాణం నిర్వహిస్తుండేది. అప్పుడు రితేశ్ సిమ్కార్డులను విక్రయిస్తుండేవారట. రాయగఢలోనే పాఠశాల విద్యనభ్యసించిన రితేశ్.. రాజస్థాన్లోని కోటలో సెయింట్ జాన్స్ సీనియర్ సెకెండరీ స్కూల్లో ఇంటర్ చదివారు. ఆ తర్వాత కళాశాల విద్య కోసం దిల్లీకి వెళ్లి.. రెండేళ్ల తర్వాత డ్రాప్ అవుట్గా మారారు. ఆ సమయంలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉద్దేశించిన థీల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్కు ఎంపికైన రితేశ్.. ఈ ఫెలోషిప్ సాధించిన వారిలో ఒకరిగా నిలిచారు. 2013 మే నెలలో ఓయో స్థాపించేందుకు లక్ష డాలర్ల గ్రాంటు అందుకున్నారు. 2013 మే నెలలో తక్కువ ధరల్లోనే నాణ్యమైన గదులతో కూడిన హోటల్స్ వసతి కల్పించే ఓయో రూమ్స్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 19 ఏళ్లే. 2013లో గుడ్గావ్లోని ఒక హోటల్తో ప్రారంభమైన అనుసంధానం.. ఇప్పుడు 800 నగరాలకు పైగా విస్తరించింది. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు 1.1బిలియన్ డాలర్లు (దాదాపు 8వేల కోట్లు)కుపైనే. భారత్లోనే కాకుండా మిగతా దేశాలకూ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం