OYO CEO: ఘనంగా ఓయో సీఈవో వివాహం.. కొత్త జంటకు కేంద్రమంత్రి విషెష్..
ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితీశ్ ఒక ఇంటివాడయ్యారు. గీతాన్హా సూద్తో ఆయన వివాహం ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటను విష్ చేసిన ఫొటోలను కేంద్రమంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ ట్విట్ చేశారు.
దిల్లీ: ఆతిథ్య సేవలందించే ఓయో (OYO) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రితేశ్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం ఘనంగా జరిగింది. రితేశ్ అగర్వాల్- గీతాన్షా సూద్ జంటను కలిసిన కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వారికి శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు. మరోవైపు, రీతేశ్-గీతాన్షా సూద్ వివాహ రిసెప్షన్ దిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరగనుంది. వివాహ రిసెప్షన్కు ప్రధాని నరేంద్ర మోదీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఇతర రాజకీయ, వాణిజ్యరంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈ కొత్త జంటను కలిసి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫొటోలను ప్రహ్లాద్ సింగ్పటేల్ ట్వీట్ చేశారు. దీనిపై రితేశ్ రిప్లయ్ ఇచ్చారు. ‘మీ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు..’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ పెళ్లికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, రితేశ్ జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదు.
రితేశ్ ఆస్తుల విలువ తెలుసా?
ఒడిశాలోని రాయగఢలో మార్వారీ కుటుంబంలో జన్మించిన రితేశ్ అగర్వాల్.. 2013లో ఓయోను స్థాపించి సక్సెస్ అయ్యారు. తక్కువ కాలంలోనే బిలియనీర్గా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. గతంలో ఆయన కుటుంబం దక్షిణ ఒడిశాలోని రాయగఢ్ నగరంలో చిన్న దుకాణం నిర్వహిస్తుండేది. అప్పుడు రితేశ్ సిమ్కార్డులను విక్రయిస్తుండేవారట. రాయగఢలోనే పాఠశాల విద్యనభ్యసించిన రితేశ్.. రాజస్థాన్లోని కోటలో సెయింట్ జాన్స్ సీనియర్ సెకెండరీ స్కూల్లో ఇంటర్ చదివారు. ఆ తర్వాత కళాశాల విద్య కోసం దిల్లీకి వెళ్లి.. రెండేళ్ల తర్వాత డ్రాప్ అవుట్గా మారారు. ఆ సమయంలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉద్దేశించిన థీల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్కు ఎంపికైన రితేశ్.. ఈ ఫెలోషిప్ సాధించిన వారిలో ఒకరిగా నిలిచారు. 2013 మే నెలలో ఓయో స్థాపించేందుకు లక్ష డాలర్ల గ్రాంటు అందుకున్నారు. 2013 మే నెలలో తక్కువ ధరల్లోనే నాణ్యమైన గదులతో కూడిన హోటల్స్ వసతి కల్పించే ఓయో రూమ్స్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 19 ఏళ్లే. 2013లో గుడ్గావ్లోని ఒక హోటల్తో ప్రారంభమైన అనుసంధానం.. ఇప్పుడు 800 నగరాలకు పైగా విస్తరించింది. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు 1.1బిలియన్ డాలర్లు (దాదాపు 8వేల కోట్లు)కుపైనే. భారత్లోనే కాకుండా మిగతా దేశాలకూ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!