Paytm: ‘పేటీఎం పనిచేస్తోంది’.. ఆర్బీఐ ఆంక్షల మధ్య వ్యవస్థాపకుడి హామీ!
Paytm: ఆర్బీఐ ఆంక్షల వల్ల పేటీఎం కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
దిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షల వల్ల పేటీఎం (Paytm) కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్శేఖర్ శర్మ స్పందించారు. పేటీఎం పనిచేస్తోందని.. ఫిబ్రవరి 29 తర్వాతా యథావిధిగా కొనసాగుతుందని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. ‘‘పేటీఎంకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి వినియోగదారుడికీ సెల్యూట్ చేస్తున్నా. ప్రతి సవాల్కూ ఓ పరిష్కారం ఉంటుంది. నిబంధనలకు లోబడి దేశానికి సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. చెల్లింపుల వ్యవస్థలో భారత్ తీసుకొస్తున్న వినూత్న ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తూనే ఉంటాయి’’ అని విజయ్ శేఖర్ వ్యాఖ్యానించారు.
ఈనెల 29 తర్వాత డిపాజిట్లు స్వీకరించొద్దని, వాలెట్లు- ఫాస్ట్ట్యాగ్లు టాప్అప్ చేయొద్దంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, దీనివల్ల ప్రస్తుతం రుణాలు, బీమా పంపిణీ, ఈక్విటీ బ్రోకింగ్ లాంటి ఆర్థిక సేవలపై ప్రభావం ఉండదని పేటీఎం (Paytm) గురువారం స్పష్టం చేసింది. పేటీఎం క్యూఆర్, పేటీఎం సౌండ్బాక్స్, పేటీఎం కార్డ్ మెషీన్ లాంటి ఆఫ్లైన్ మర్చంట్ పేమెంట్ నెట్వర్క్ సేవలు యథాతథంగానే కొనసాగుతాయని, కొత్త ఆఫ్లైన్ మర్చంట్స్ను నియమించుకుంటామని తెలిపింది.
పీపీబీఎల్పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వన్97 కమ్యూనికేషన్స్ షేరు (Paytm Share Price) వరుసగా రెండోరోజు శుక్రవారం కుదేలైంది. బీఎస్ఈలో 20% పతనమై రూ.487.05 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకింది. ఎన్ఎస్ఈలోనూ 20 శాతం కుంగి రూ.487.20కు చేరింది. ఫలితంగా పేటీఎం మార్కెట్ విలువ రూ.30,941.15 కోట్లకు పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.