Piyush Goyal: అమెరికా టారిఫ్‌లు.. గుడ్‌న్యూస్ ఎప్పుడు వినొచ్చంటే..?

Eenadu icon
By Business News Team Published : 19 Oct 2025 00:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా-భారత్‌ (USA-India)కు మేలు చేసేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్లకు భారత్ తలాడించకపోవడంతో ఆ ఒప్పందం కుదరడానికి సమయం పడుతోంది. ఈలోపే ట్రంప్ భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించారు. ఈ సుంకాల (US tariffs) విషయంలో గుడ్‌న్యూస్ ఎప్పుడు వింటామని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు.

‘‘చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో సాగుతున్నాయని నేను విశ్వసిస్తున్నాను. వాణిజ్య చర్చలు, ఒప్పందాలు డెడ్‌లైన్స్‌పై ఆధారపడి ఉండవు. భారత రైతులు, మత్స్యకారులు, ఎంఎస్‌ఎంఈ రంగం వంటి వాటికి ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కరించకుండా ఒప్పందం జరగదు. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం. చర్చలు కొనసాగుతున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తాం’’ అని పీయూష్ గోయల్ (Piyush Goyal) వెల్లడించారు. ఎలాంటి కచ్చితమై తేదీని మాత్రం తెలియజేయలేదు. 

వ్యవసాయ ఉత్పత్తుల (Agriculture Products)పై సుంకాలు తగ్గించాలని అమెరికా చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. అందుకు ఆమోదిస్తే.. దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశం అయినందున.. వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపునకు భారత్‌ ససేమిరా అంది. గతంలోనూ ఈ విషయంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదే అగ్రరాజ్యం ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు, రష్యా నుంచి న్యూదిల్లీ చమురు కొనుగోలును కూడా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని