Piyush Goyal: మన స్టార్టప్లు చిప్స్, ఐస్క్రీమ్ల దగ్గరే ఆగిపోకూడదు: పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్డెస్క్: భారత్ స్టార్టప్ (startups)లను ఉద్దేశించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు అంకుర సంస్థలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్లపై ఎక్కువగా దృష్టి సారించాయన్నారు. కానీ చైనాలోని స్టార్టప్లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు.
‘‘దేశంలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్ల పరిస్థితి చూస్తే.. మనం ఫుడ్ డెలివరీ యాప్స్పై దృష్టిసారించాం. ఇలాంటి వాటి వల్ల దిగువ శ్రేణి కార్మికులు తయారై సంపన్నులు కాలు బయటపెట్టకుండా ఆహారం పొందగలుతున్నారు. ఇదే సమయంలో చైనా సంస్థలు ఏఐ, ఈవీలు, సెమీ కండక్టర్ల రంగాలను ఎంచుకుంటున్నాయి. భారత్లో డీప్-టెక్ స్టార్టప్లు పరిమిత సంఖ్యలోనే వస్తున్నాయి. ఆ రంగంలో కేవలం 1,000 స్టార్టప్లు మాత్రమే ఉండటం ఆందోళనకర పరిస్థితి. ఇక్కడి యువతరం గొప్ప ఆలోచనలు రూ.25 లక్షలు, రూ.50 లక్షలకు విదేశీ కంపెనీలకు అమ్ముడుపోతున్నాయి. కొత్త అంకుర సంస్థలు భవిష్యత్ తరాల కోసం దేశాన్ని సిద్ధం చేయాలి. మనం ఐస్క్రీం, చిప్స్ అమ్మడం దగ్గరే ఆగిపోకూడదు. డెలివరీ బాయ్స్/గర్ల్స్గానే మిగిలిపోదామా? అదే భారత్ లక్ష్యమా..? అది అంకురాల ఉద్దేశం కాదు’’ అని స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
విమర్శించడం తేలిక: జెప్టో సీఈఓ
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై క్విక్ కామర్స్ సంస్థ జెప్టో సీఈఓ అదిత్ పలిచా స్పందించారు. విమర్శించడం తేలిక అంటూ మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘యూఎస్, చైనాలోని డీప్ టెక్ నైపుణ్యంతో పోల్చి, భారత్లోని కన్జ్యూమర్ ఇంటర్నెట్ స్టార్టప్లను విమర్శించడం చాలా తేలిక. ప్రస్తుతం జెప్టోలో 1.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 3.5 సంవత్సరాల క్రితం అసలు ఆ సంస్థే లేదు. మేం పన్నులు చెల్లిస్తున్నాం. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయి. సరఫరా గొలుసులను నిర్వహించేందుకు వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ఆవిష్కరణల్లో ఇదొక అద్భుతం కాకపోతే.. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు.
భారత్కు భారీస్థాయిలో ఏఐ మోడల్ ఎందుకు లేదు..? ఎందుకంటే, అమెజాన్, ఫేస్బుక్, అలీబాబా, గూగుల్ వంటి పెద్ద ఇంటర్నెట్ సంస్థలు ఇక్కడ లేవు. అవి కూడా కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీలుగా ప్రస్థానం మొదలుపెట్టినవే. అవే ఏఐ వంటి ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్నాయి. వాటి వద్ద విస్తృత డేటా, టాలెంట్, పెట్టుబడులు ఉన్నాయి. అందుకే అది సాధ్యమైంది. స్టార్టప్ ఎకోసిస్టమ్, ప్రభుత్వం, మూలధనాన్ని కలిగి ఉన్న యాజమాన్యాలు.. ఈ స్థానిక ఛాంపియన్లకు మద్దతు ఇవ్వాలి. అంతేగానీ ఎదగడానికి ప్రయత్నిస్తున్నవారిని అణచి వేయకూడదు’’ అని పలిచా అన్నారు. భారత స్టార్టప్లను తక్కువ చేయొద్దని, డీప్టెక్ సంస్థల వృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తోందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్దాస్ పాయ్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
Free ChatGPT Go Plan: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా భారత్లో ‘చాట్జీపీటీ గో’ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                                    
                                        

భారత్లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
Billionaires: ఆర్థిక అసమానతల వల్ల దేశాలు ప్రజాస్వామ్య తిరోగమాన్ని చవిచూస్తాయని జీ20 నివేదిక వెల్లడించింది. - 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 


