2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
దిల్లీ: భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. వినియోగంలో వృద్ధి ఇందుకు దోహదం చేస్తుందని, తద్వారా మున్ముందు కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని ఆమె అన్నారు. సీఐఐ వార్షిక బిజినెస్ సదస్సులో పరిశ్రమ సంస్థల అధిపతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె ప్రసంగించారు. ‘గతంలో కార్పొరేట్, బ్యాంకింగ్ వ్యవస్థల బ్యాలెన్స్షీట్ల ప్రతికూలతల నుంచి మనదేశం బయట పడుతోంది. ఇందువల్ల కార్పొరేట్ కంపెనీల పెట్టుబడుల విస్తరణతో పాటు బ్యాంకుల రుణ సామర్థ్యం, రుణ మంజూరుకు ఆసక్తిని పెంచుతోంద’ని వివరించారు. యువ జనాభా పరంగా దేశానికి ఉన్న సానుకూలత వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి కలిసి వస్తుంది: కృత్రిమ మేధ, బిగ్ డేటా లాంటి విభాగాల్లో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం దేశానికి సంపదను సృష్టించే చర్య అని, వినియోగదారు గిరాకీ పెరిగేందుకూ ఇది ఉపకరిస్తుందని అన్నారు. హరిత ఇంధనం దిశగా భారత్ అడుగులు వేస్తుండటం కొత్త మార్కెట్ల సృష్టి, గిరాకీకి దోహదం చేస్తుందని వివరించారు. సౌర విద్యుత్, హరిత హైడ్రోజన్, హరిత అమోనియాలకు ప్రాధాన్యం ఇవ్వడం ,యువతకు గణనీయ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మంచి మెజార్టీతో భాజపా తిరిగి అధికారంలోకి వస్తుందని, వరుసగా మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపడతారని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తిరిగి ఏర్పడ్డాక.. పరిశ్రమకు మరింతగా మంచి చేసే నిమిత్తం బడ్జెట్లో చేపట్టాల్సిన చర్యలపై సీఐఐతో సంప్రదింపులు చేస్తామని తెలిపారు. భారత్లో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని.. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థలోని అని రంగాల్లోనూ కనిపిస్తోందని అన్నారు.
తయారీ రంగంపై మరింత దృష్టి: భారత్ స్వయం సమృద్ధిని సాధించేందుకు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో తన వాటాను పెంచుకునేందుకు తయారీ రంగంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 పరిణామాల తర్వాత చైనా నుంచి తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించాలనే (చైనా ప్లస్ వన్) వ్యూహాన్ని అంతర్జాతీయ సంస్థలు అమలు చేస్తున్న నేపథ్యంలో, తయారీ రంగ సామర్థ్య విస్తరణను వేగవంతం చేసేందుకు మనదేశానికి ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని, తయారీ కార్యకలాపాలను వర్ధమాన విపణులకు తరలించాలని భావిస్తున్న ఐరోపా, అమెరికాలోని కంపెనీలకు అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానాల జాబితాలో భారత్ ముందువరుసలో ఉందని క్యాప్జెమిని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదికను ఉటంకిస్తూ మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..