థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఆ విద్యుత్ కొనాల్సిందే
Thermal plants: థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నిబంధనలను సవరించింది. 2023 ఏప్రిల్ 1 తర్వాత ఏర్పాటు చేసే ప్లాంట్లు తప్పనిసరిగా పునరుత్పతాదక విద్యుత్ను కొనుగోలును తప్పనిసరి చేసింది.
దిల్లీ: దేశంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే థర్మల్ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే అందులో 40 శాతం వాటాకు సమానమైన పునరుత్పాదక విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. లేదంటే అంతమొత్తానికి సమానమైన విద్యుత్ కొనుగోలు చేయాలని పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే పవర్ ప్లాంట్లకు ఈ నిబంధన తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లోని టారిఫ్ పాలసీ 2016ని ఇంధన మంత్రిత్వ శాఖ సవరించింది.
‘‘2023 ఏప్రిల్ 1 తర్వాత కోల్/లిగ్నైట్ ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే పునరుత్పాదక కొనుగోలు బాధ్యత కింద గ్రీన్ ఎనర్జీని ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే థర్మల్ జనరేటింగ్ స్టేషన్ సామర్థ్యంలో 40 శాతానికి సమానమైన పునరుత్పాదక విద్యుత్ను సేకరించి సరఫరా చేయాలి’’ అని ఇంధన మంత్రిత్వ శాఖ సూచించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. 2025 తర్వాత ఏర్పాటు చేయబోయే ప్లాంట్లకు రెన్యూవబుల్ జనరేషన్ ఆబ్లిగేషన్ కింద 40 శాతం విద్యుత్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, సొంత బొగ్గు గనులు కలిగిన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె