Cement: కాలుష్య రహితంగా సిమెంట్ తయారీ!
కాలుష్యానికి తావు లేకుండా (నెట్ జీరో కార్బన్) సిమెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సిమెంటు పరిశ్రమ నిర్దేశించుకోవాలని జేకే సిమెంట్ లిమిటెడ్ సీఈఓ, గ్రీన్ సిమెంటెక్ 2024 ఛైర్మన్ మాధవ్ కృష్ణ సింఘానియా సూచించారు.
‘నెట్ జీరో కార్బన్’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పరిశ్రమ
అంతర్జాతీయ ఉత్పత్తిలో మన దేశానికి రెండోస్థానం
ఈనాడు, హైదరాబాద్: కాలుష్యానికి తావు లేకుండా (నెట్ జీరో కార్బన్) సిమెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సిమెంటు పరిశ్రమ నిర్దేశించుకోవాలని జేకే సిమెంట్ లిమిటెడ్ సీఈఓ, గ్రీన్ సిమెంటెక్ 2024 ఛైర్మన్ మాధవ్ కృష్ణ సింఘానియా సూచించారు. వాతావరణ మార్పులపై పోరాటానికి తమ వంతు కృషి ఈ విధంగా చేయాలని, ఇందువల్ల సిమెంటు కంపెనీలకూ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో గురువారం సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 2024 ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచ వ్యాప్తంగా సిమెంటు ఉత్పత్తిలో మనదేశం రెండో స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, స్థిరాస్తి నిర్మాణాల నుంచి లభించే డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని దేశీయ సిమెంటు పరిశ్రమ 2026 వరకూ ఏటా 7% వృద్ధి సాధిస్తుందన్నది అంచనా. తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో సిమెంటు ఉత్పత్తి వల్ల ఎంతో కాలుష్యం వెలువడి, పర్యావరణానికి నష్టం చేకూరుతుంది. అందుకే కాలుష్యానికి తావులేని రీతిలో సిమెంటు ఉత్పత్తి చేయడానికి అనువైన వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 2024 కృషి చేస్తోంద’ని మాధవ్ కృష్ణ సింఘానియా వివరించారు.
పరిశోధనలే కీలకం: కాలుష్య రహిత లక్ష్యాలను చేరుకోవడం ద్వారా, పర్యావరణ పరిరక్షణలో దేశానికి అండగా నిలవాలని సిమెంటు పరిశ్రమ భావిస్తున్నట్లు శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఎండీ, సిమెంటు ఉత్పత్తిదార్ల సంఘం అధ్యక్షుడు నీరజ్ అఖౌరీ పేర్కొన్నారు. పరిశోధన- అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా పర్యావరణ లక్ష్యాలను చేరొచ్చని అల్ట్రాటెక్ సిమెంట్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ రాజు గోయల్ సూచించారు. ఫ్లైయాష్, స్లాగ్ సిమెంట్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, సిమెంటు రవాణాలో విద్యుత్తు వాహనాలను వినియోగించాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఉపాధ్యక్షుడు శేఖర్ రెడ్డి కోరారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సిమెంటు ఉత్పత్తి, రవాణా, పంపిణీ విభాగాల్లో అనుసరించాల్సిన కొత్త విధానాలు, పర్యావరణానికి నష్టం చేసే విధానాలను తిరస్కరించడం, వనరులను సమర్థంగా వినియోగించుకోవటం.. వంటి అంశాలపై చర్చిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
Zomato Paytm Deal: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పేటీఎం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఓ కీలక వ్యాపార విభాగాన్ని జొమాటోకు విక్రయించనున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
Anil Agarwal: ఫాదర్స్డే సందర్భంగా వేదాంత వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన నాన్నను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘ఎక్స్’’ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
Vodafone Idea: దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉండేలా వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ నెల రోజులు. -
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
తాజా వార్తలు (Latest News)
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
-
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్.. వీడియో
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి