Ramoji rao: పారిశ్రామికవేత్తలకూ మార్గదర్శి రామోజీ
రామోజీరావు కేవలం జర్నలిజంలోనే కాదు.. పారిశ్రామికవేత్తలకూ మార్గదర్శేనని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. వినూత్నత కోసం నిరంతరం శ్రమించడం, సమయ పాలన వంటివి రామోజీరావు నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అలవర్చుకుంటే, వృద్ధి సాధ్యమని వివరించారు.
రామోజీరావు కేవలం జర్నలిజంలోనే కాదు.. పారిశ్రామికవేత్తలకూ మార్గదర్శేనని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. వినూత్నత కోసం నిరంతరం శ్రమించడం, సమయ పాలన వంటివి రామోజీరావు నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అలవర్చుకుంటే, వృద్ధి సాధ్యమని వివరించారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని, ప్రజలకు మంచి చేయడంలోనూ ఎప్పుడూ ముందుండేవారని ఎస్ఎంఎస్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ పి.రమేశ్ బాబు తెలిపారు. రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించిన వాణిజ్య ప్రముఖుల్లో నవయుగ గ్రూప్ ఛైర్మన్ సి.విశ్వేశ్వరరావు, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్, జెమినీ కిరణ్, ప్రముఖ పారిశ్రామిక వేత్త బొల్లినేని కృష్ణయ్య, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఎండీ రాయల రఘు, సెల్కాన్ ఎండీ వై.గురు, జెన్ సెక్యూరిటీస్ జాయింట్ ఎండీ కంతేటి సతీష్, అలేఖ్య హోమ్స్ అధినేత శ్రీనాధ్, ప్రగతి ప్రింటర్స్ సీఈఓ నరేంద్ర, విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, టెక్ ఎరా ఎండీ కిరణ్, ఐలాపురం హోటల్ అధిపతి రాజా, పాపులర్ షూమార్ట్ అధిపతి చుక్కపల్లి అరుణ్ కుమార్, తెలంగాణ చిట్ఫండ్ ఫెడరేషన్ ప్రతినిధులు ఉన్నారు.
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను పరామర్శిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్, జెమినీ కిరణ్
పత్రికా స్వేచ్ఛ కోసం అవిశ్రాంత పోరాటం
‘తెలుగు వెలుగు’ రామోజీరావు మరణం జాతికి తీరని లోటు. మీడియా రంగంలో తిరుగులేని వ్యక్తి. పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన అవిశ్రాంత పోరాటం చేశారు. ఎంతోమంది వ్యాపారవేత్తలకు ఒక మార్గదర్శి. ఆయన వృత్తి నైపుణ్యం, అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (అసోచామ్) అంధ్రప్రదేశ్, తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్ బృందం రామోజీరావుకు నివాళులర్పిస్తోంది.
కటారు రవికుమార్ రెడ్డి, ఛైర్మన్, ఆసోచామ్ ఏపీ, తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్
రామోజీరావు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న అలేఖ్య హోమ్స్ అధినేత శ్రీనాధ్, ప్రగతి ప్రింటర్స్ సీఈఓ నరేంద్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం