Vijaypat Singhania: ఆ ఫొటో వెనుక ఉద్దేశాలు వేరు.. గౌతమ్ సింఘానియా పోస్ట్పై తండ్రి
Vijaypat Singhania: రేమండ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా ఇటీవల తన తండ్రి విజయ్పత్ సింఘానియాతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీనిపై విజయ్పత్ స్పందించారు. తన కుమారుడితో ఎప్పటికీ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
దిల్లీ: ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమండ్ (Raymond Group) ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన తండ్రి విజయ్పత్ సింఘానియా మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తండ్రిని ఇంటికి ఆహ్వానించి.. ఆశీర్వాదం తీసుకున్నట్లు ఇటీవల గౌతమ్ (Gautam Singhania) ఇన్స్టాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసున్నట్లు దీనిలో ఉంది. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాసుకొచ్చారు.
విజయ్పత్ తాజాగా దీనిపై స్పందించారు. కుమారుడు గౌతమ్తో ఎప్పటికీ సయోధ్య సాధ్యంకాదని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మార్చి 20న సహాయకుల ద్వారా గౌతమ్ తనని ఇంటికి ఆహ్వానించారని చెప్పారు. మొదట్లో నిరాకరించినప్పటికీ.. వీడియో కాల్లో ప్రాధేపడటంతో ఇష్టం లేకున్నా వెళ్లానని చెప్పారు. కాసేపటికే నేను, గౌతమ్ కలిసిపోయినట్లు ఇంటర్నెట్లో ఫొటోలు రావడం గమనించానని చెప్పారు. దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆయన ఆహ్వానించింది విభేదాల పరిష్కారానికో.. లేక.. కాఫీకో కాదని.. దాని వెనుక ఇంకేదో ఉద్దేశం ఉందన్నారు. ‘‘నేను జేకే హౌస్లోకి ప్రవేశించడం పదేళ్లలో ఇదే తొలిసారి. మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని విజయ్పత్ (Vijaypat Singhania) అన్నారు.
ట్రంప్నకు మళ్లీమళ్లీ రాని రోజు..ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం..!
2015లో రేమండ్ ఛైర్మన్ పదవి నుంచి విజయ్పత్ వైదొలిగారు. కుమారుడు గౌతమ్కు బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి ఇరువురి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2018లో సంస్థ గౌరవ ఛైర్మన్ పదవి నుంచి కూడా విజయ్పత్ను పక్కన పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు