Home Loan: అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? పెరిగిన EMI ఇక చెల్లించాల్సిందేనా?
ఆర్బీఐ రెపో రేటు పెంపుతో మరోసారి గృహ రుణాలు (Home loans) ప్రియం కానున్నాయి. అయితే, మునుపటిలా కాలవ్యవధిని కాకుండా ఈఎంఐ మొత్తాన్ని పెంచేందుకు బ్యాంకులు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి రెపోరేటును (Repo rate) 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది మే నెలలో 40 బేసిస్ పాయింట్లతో పెంపును మొదలు పెట్టిన ఆర్బీఐ.. విడతల వారీగా 2.25 శాతం మేర వడ్డీని పెంచింది. అక్టోబర్ వరకు పెంచిన 190 బేసిస్ పాయింట్ల వడ్డీని ఇప్పటికే రుణ సంస్థలకు రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. తాజా పెంపు నేపథ్యంలో వడ్డీని మరోసారి సవరించనున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటికే గృహ (Home loan), వాహన రుణాలు (Auto loan) తీసుకున్న వారిపై మరోసారి వడ్డీ భారం పడనుంది. కొత్తగా తీసుకోవాలనుకునే వారూ రుణాలు తీసుకోవాలంటే వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది.
ఈఎంఐ ఎంత పెరిగింది?
కరోనా తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో గృహ రుణాలు (Home loan) చౌకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఓ దశలో 6.50 శాతానికే గృహ రుణం లభించింది. చాలా వరకు బ్యాంకులు, గృహ రుణ సంస్థలు పోటీపడి మరీ రుణాలు ఇచ్చాయి. ప్రాసెసింగ్ ఫీజు రద్దు, కొన్ని ఈఎంఐలపై (EMI) రాయితీనీ అందించాయి. కట్ చేస్తే అప్పుడు తక్కువకే రుణాలు తీసుకున్న వారికి ఇప్పుడు గృహ రుణాలు భారమై కూర్చున్నాయి.
ఉదాహరణకు 2022 ఏప్రిల్లో ఒక వ్యక్తి 30 ఏళ్ల కాలానికి రూ.30 లక్షలు రుణం తీసుకున్నాడనుకుందాం. అప్పట్లో 7 శాతం వడ్డీ అనుకుంటే ఈఎంఐ రూ.19,954 వద్ద ఉండేది. తాజాగా ఆర్బీఐ పెరిగిన వడ్డీ రేటును బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తే వడ్డీ 9.25 శాతానికి చేరుతుంది. అప్పుడు ఈఎంఐ రూ.24,680 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో నెల ఈఎంఐ రూ.4600 మేర పెరిగిందన్నమాట!
పెరిగిన ఈఎంఐ చెల్లించాల్సిందేనా?
ఆర్బీఐ రెపో రేటును పెంచిన ప్రతిసారీ గృహ రుణాలపై వడ్డీని బ్యాంకులు పెంచుతూ వచ్చాయి. అయితే, వినియోగదారులపై ఆ భారం నేరుగా పడలేదు. కారణం.. బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా కాలవ్యవధిని పెంచుకుంటూ పోవడమే. అంటే ఈఎంఐలు చెల్లించాల్సిన గడువు పెరుగుతూ వచ్చింది. సాధారణంగా 20, 25, 30 ఏళ్ల దీర్ఘకాలానికి గృహ రుణం తీసుకుని ఉంటారు. ఇప్పటి వరకు వడ్డీ పెరిగినప్పుడల్లా కాలవ్యవధిని పెంచిన బ్యాంకులు.. ఇకపై రిస్క్ తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. రుణం మొత్తం పూర్తయ్యేనాటికి రుణ గ్రహీత వయసు 60-65 ఏళ్లు ఉండేలా బ్యాంకులు చూసుకుంటాయి. ఈ కారణంతోనే తాజా వడ్డీ రేటు పెంపు వల్ల మరోసారి కాలవ్యవధిని పెంచేందుకు అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈసారి పెరిగిన మొత్తాన్ని ఈఎంఐ మొత్తం పెంచేందుకు బ్యాంకులు మొగ్గు చూపొచ్చని అంటున్నారు.
ఇప్పుడేం చేయాలి..?
- వడ్డీ పెరిగినప్పుడల్లా అసలులో కొంత మొత్తం చెల్లిస్తూ ఉండాలి. ముఖ్యంగా బోనస్లాంటివి వచ్చినప్పుడు, ఇతర అనుకోని ఆదాయాలు లభించినప్పుడు వాటిని ఇంటి అప్పు తీర్చేందుకు వాడుకోవచ్చు.
- తక్కువ వడ్డీకి ఉన్న డిపాజిట్లను గృహ రుణాల చెల్లింపులకు ఉపయోగించడం మంచిది.
- వడ్డీ రేట్లు పెరుగుతున్న దశలో ఖర్చులను వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రూ.100 మిగిలినా దాన్ని అప్పు చెల్లించేందుకు వినియోగించేలా ఏర్పాటు ఉండాలి.
- కనీసం 3-6 నెలల ఖర్చులు, ఈఎంఐలకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్