Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు షాక్.. ఆర్బీఐ భారీ జరిమానా
RBI imposes penalty on Paytm Payments Bank: నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు ఆర్బీఐ గట్టి షాకిచ్చింది. ఏకంగా రూ.5 కోట్లు పెనాల్టీ వడ్డించింది.
Paytm Payments Bank | ముంబయి: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు (Paytm Payments Bank) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. కేవైసీ సహా కొన్ని నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు రూ.5.39 కోట్లు జరిమానా విధించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పేమెంట్స్ బ్యాంక్స్ లైసెన్సింగ్కు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ భద్రతకు నిర్దేశించిన నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైనట్లు తాము గుర్తించామని ఆర్బీఐ తెలిపింది.
KYC/AML (యాంటీ మనీ లాండరింగ్) కోణంలో బ్యాంక్లో ప్రత్యేక పరిశీలన జరిపామని, ఆర్బీఐ గుర్తించిన ఆడిటర్లతో బ్యాంక్లో సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించామని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే పేఔట్ సర్వీసుల (వ్యాపారులకు అందించే సర్వీసు) సంబంధించి సంస్థ యజమానులను గుర్తించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైనట్లు తేలిందని ఆర్బీఐ పేర్కొంది. పేఔట్ లావాదేవీలు, ఆయా సంస్థల రిస్క్ ప్రొఫైలింగ్ను మానిటర్ చేయడంలోనూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైటనట్లు గుర్తించింది. పేఅవుట్ సేవలు పొందుతున్న నిర్దిష్ట కస్టమర్ల అడ్వాన్స్ ఖాతాల్లో ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్కు సంబంధించి నిర్దేశించిన పరిమితినీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉల్లంఘించిందని ఆర్బీఐ తెలిపింది.
క్రోమ్ యూజర్లకు CERT-In అలర్ట్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..!
పలు ఉల్లంఘనలు గుర్తించిన అనంతరం ఎందుకు పెనాల్టీ విధించకూడదో పేర్కొంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. దీనిపై బ్యాంక్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంతోపాటు వ్యక్తిగత విచారణలో ఇచ్చిన సమాధానం ఆధారంగా ఈ పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ పెనాల్టీ కేవలం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినది మాత్రమేనని, కస్టమర్ల లావాదేవీలకు ఎలాంటి సంబంధం లేదని ఆర్బీఐ పేర్కొంది. పేటీఎంతో పాటు పుణె వేదికగా పనిచేస్తున్న అన్నాసాహెబ్ మగర్ సహకారి బ్యాంక్కు సైతం రూ.4 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం