RBI Interest Rates: పాత వడ్డీరేట్లే.. అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ నిర్ణయం!
RBI Interest Rates: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు గతకొన్ని రోజులుగా అంచనా వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికనుగుణంగానే ఆర్బీఐ నిర్ణయం వెలువడింది.
ముంబయి: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ నేతృత్వంలో బుధవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం వరుసగా ఇది నాలుగోసారి.
పాలసీ రేట్లు ఇలా ఉన్నాయి..
- రెపో రేటు - 6.50%
- ఎస్డీఎఫ్ఆర్- 6.25%
- ఎంఎస్ఎఫ్ఆర్- 6.75%
- బ్యాంక్ రేటు- 6.75%
- రివర్స్ రెపో రేటు- 3.35%
గత ఎంపీసీ సమావేశం జరిగిన ఆగస్టుతో పోలిస్తే ఈసారి ద్రవ్యోల్బణం (Retail inflation) పెరిగింది. వృద్ధి బలంగానే ఉన్నప్పటికీ.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు నిర్ణయాలపరంగా దూకుడును కొనసాగిస్తుండటంతో అంతర్జాతీయంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ (RBI) కీలక రేట్లను యథాతథంగానే ఉంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు గతకొన్ని రోజులుగా అంచనా వేస్తూ వచ్చారు. తాజా ఆర్బీఐ నిర్ణయాలు కూడా అందుకు అనుగుణంగానే ఉండడం గమనార్హం. వడ్డీరేట్లను మార్చకుండా అలాగే కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే.. దాన్ని లక్ష్యిత పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని తెలిపారు.
మూడుకు మించి బ్యాంకు ఖాతాలున్నాయా..కాస్త ఆలోచించాల్సిందే! ఎందుకంటే..
ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతం..
ఆర్బీఐ ద్రవ్యోల్బణ (Retail inflation) లక్ష్యం 2-4 శాతం కాదని.. అది నాలుగు శాతమని శక్తికాంత దాస్ తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తామన్నారు. సెప్టెంబరులో ద్రవ్యోల్బణం (Retail inflation) దిగొచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కూరగాయల ధరలు, వంటగ్యాస్ సిలిండర్ రేటు తగ్గిన నేపథ్యంలో స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం (Retail inflation) దిగొస్తుందని తెలిపారు. 2023- 24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. మూడో త్రైమాసికంలో ఆహార పదార్థాల ధరల్లో స్థిరమైన తగ్గుదల నమోదయ్యే సూచనలు లేవని తెలిపారు. ప్రస్తుతం 6.8 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆహారపదార్థాలు, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగితే పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్బీఐ సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ద్రవ్యోల్బణ అంచనాలు..
- 2023-24 - 5.4%
- 2023-24 రెండో త్రైమాసికం - 6.4%
- 2023-24 మూడో త్రైమాసికం - 5.6%
- 2023-24 నాలుగో త్రైమాసికం - 5.2%
- 2024-25 తొలి త్రైమాసికం - 5.2%
వృద్ధిరేటు ఇలా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ఆర్బీఐ 6.5 శాతంగా పేర్కొంది. ప్రైవేట్ రంగంలో మూలధన వ్యయం పుంజుకుంటోందని శక్తికాంత దాస్ తెలిపారు. బలమైన గిరాకీ నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా మారుతోందన్నారు. ఆస్తుల నాణ్యత మెరుగైన నేపథ్యంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలం సంతరించుకుంటోందన్నారు. సెప్టెంబరు 29 నాటికి దేశ విదేశీ మారక నిల్వలు 586.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించారు.
వృద్ధిరేటు అంచనాలు..
- 2023-24 - 6.5%
- 2023-24 రెండో త్రైమాసికం - 6.5%
- 2023-24 మూడో త్రైమాసికం - 6.0%
- 2023-24 నాలుగో త్రైమాసికం - 5.7%
- 2024-25 తొలి త్రైమాసికం - 6.6%
అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో బుల్లెట్ పేమెంట్ స్కీమ్ కింద బంగారు రుణాలను రెండింతలు పెంచి రూ.4 లక్షలు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మరోవైపు పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ను 2025 డిసెంబర్ వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం అంతర్గత అంబుడ్స్మన్ స్కీమ్ను మరింత పటిష్ఠం చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్