RBI annual report: ఆర్బీఐ బ్యాలన్స్షీట్ రూ.70.48 లక్షల కోట్లు
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధిని నమోదు చేయగలదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేస్తోంది.
పాకిస్థాన్ జీడీపీకి 2.5 రెట్లు
2024-25లో వృద్ధి అంచనా 7%
బ్యాంకింగ్లో మోసాల అడ్డకట్టకు చర్యలు
వార్షిక నివేదిక
ముంబయి: ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధిని నమోదు చేయగలదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేస్తోంది. స్థూల ఆర్థిక మూలాలు బలోపేతం అవుతుండడం ఇందుకు నేపథ్యమని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. 2021-22లో 9.1%, 2022-23లో 7.2% వృద్ధి నమోదు కాగా, 2023-24లో వృద్ధిరేటు 7.6 శాతానికి చేరుతుందనే అంచనా ఉంది. 7 శాతం లేదా అంతకంటే అధిక వృద్ధిని వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ నమోదు చేయనుండటం విశేషం. అనిశ్చిత పరిస్థితుల్లోనూ 2023-24లో భారత ఆర్థికం బలంగా రాణించిందని ఆర్బీఐ వివరించింది.
లక్ష్యం దిశగా ద్రవ్యోల్బణం
రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని, లక్ష్యం దిశగా దిగి వస్తున్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. సరఫరా వైపు సమస్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదని తెలిపింది. 2023-24లో టోకు ద్రవ్యోల్బణం 5.4 శాతానికి తగ్గింది. 2022-23లో ఇది 6.7 శాతంగా ఉంది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా ఆహార, ఇంధనాన్ని మినహాయిస్తే 6.1% నుంచి 4.3 శాతానికి పరిమితమైంది.
2023-24లో ఖరీఫ్, రబీ సీజన్లకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) వల్ల అన్ని పంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% అధికంగా ప్రయోజనం దక్కిందని నివేదిక తెలిపింది.
కరోనా ముందు స్థాయికి..
2023-24లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీటు 11.08% వృద్ధి పెరిగి రూ.70.48 లక్షల కోట్ల (845 బిలియన్ డాలర్ల)కు చేరింది. పాకిస్థాన్ మొత్తం జీడీపీ 340 బి. డాలర్ల (సుమారు రూ.28 లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. 2022-23లో ఇది రూ.63.44 లక్షల కోట్లుగా నిలిచింది. కరోనా ముందు స్థాయికి ఆర్థిక పరిస్థితులు పుంజుకోవడంతో, 2024 మార్చి చివరకు భారత జీడీపీలో 24.1 శాతానికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీటు చేరింది. అంతక్రితం ఏడాది 23.5 శాతంగానే ఉంది.
ఆర్బీఐ ఆదాయం 17% పెరగడం, వ్యయాలు 56.3% తగ్గడంతో పాటు విదేశీ సెక్యూరిటీల వడ్డీ ఆదాయం రాణించడంతో అదనపు నిల్వలు 141.23% పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి. వీటినే కేంద్రానికి డివిడెండు రూపంలో బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.
ఆర్బీఐ వద్ద 822 టన్నుల బంగారం
విదేశీ పెట్టుబడులు, బంగారం, రుణాలు-అడ్వాన్సులు వరుసగా 13.9%, 18.26%, 30.05% చొప్పున పెరగడం వల్ల కూడా ఆర్బీఐ బ్యాలెన్స్ షీటు రాణించింది. మొత్తం విలువలో దేశీయ ఆస్తుల విలువ 23.31%గా ఉండగా.. విదేశీ కరెన్సీ, బంగారం, రుణాలు, భారత్ వెలుప ఆర్థిక సంస్థలకిచ్చిన రుణాలు మొత్తం ఆస్తుల్లో 76.69 శాతంగా ఉన్నాయి. ఆర్బీఐ వద్ద 822.10 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందులో 308.03 మెట్రిక్ టన్నుల పసిడిని, నోట్ల జారీకి దన్నుగా పక్కకు తీసిపెట్టారు.
ఇష్యూ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న పసిడి విలువ 2023 మార్చి 31న రూ.1,40,765.60 కోట్లుగా ఉండగా.. 2024 మార్చి చివరికి 16.94% పెరిగి రూ.1,64,604.91 కోట్లకు చేరింది. అదనంగా 6.94 టన్నుల పసిడి జత చేరడంతో పాటు పసిడి ధర పెరగడం, రూపాయి విలువ క్షీణించడం ఇందుకు సహకరించింది.
బ్యాంకింగ్ రంగంలో 36,075 మోసాలు
2023-24లో బ్యాంకింగ్ రంగంలో మొత్తం 36,075 మోసాలు జరిగాయి. 2022-23లో ఈ సంఖ్య 13,564 మాత్రమే. అయితే మోసాలతో ముడిపడిన డబ్బు విలువ మాత్రం రూ.26,127 కోట్ల నుంచి 46.7% తగ్గి రూ.13,930 కోట్లకు పరిమితమైంది. మోసాలను అరికట్టడంతో పాటు చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇందు కోసం.. నగదు బదిలీకి ముందే రియల్ టైంలో నగదు స్వీకరించే వ్యక్తి పేరును పరిశీలించుకునే అవకాశాన్ని తెస్తున్నట్లు తెలిపింది. కొత్తగా వచ్చిన ‘ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023’కు అనుగుణంగా దీనిని తీసుకువస్తామని తెలిపింది.
- గత మూడేళ్లలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనే అధిక సంఖ్యలో మోసాలు జరిగాయి. తక్కువ విలువ ఉన్న కార్డు/ ఇంటర్నెట్ మోసాలే ఇందుకు కారణం.
- మోసాల విలువ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా ఎక్కువగా ఉంది. రుణ విభాగాల్లో మోసాలే ఇందుకు నేపథ్యం. 2022-23, 2023-24లో నమోదైన మోసాలకు సంబంధించి మోసం చోటుచేసుకున్న సమయానికి, వాటిని గుర్తించిన సమయానికి మధ్య చాలా కాలావధి ఉందని నివేదిక విశ్లేషించింది.
మొత్తం నగదులో రూ.500 నోట్లే 86.5%
- 2024 మార్చి చివరకు మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా 86.5 శాతానికి చేరింది. ఏడాది కిందట వీటి వాటా 77.1% మాత్రమే. రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు 2023 మేలో ప్రకటించడం ఇందుకు కారణమని ఆర్బీఐ వెల్లడించింది. మొత్తం నగదులో రూ.2000 నోట్ల వాటా ఏడాది కిందట 10.8 శాతంగా ఉండగా.. ఇపుడు 0.2 శాతానికి పరిమితమైంది.
- 2023-24లో 26,000కు పైగా నకిలీ రూ.2000 నోట్లు కనిపించాయి. అంతక్రితం ఏడాది 9806 నోట్లు మాత్రమే నకిలీవి లభించాయి. రూ.500 నోట్లలో మాత్రం నకిలీవి 91,110 నుంచి 85,711కి తగ్గాయి.
- పరిమాణం పరంగా చూస్తే రూ.500 నోట్లు దాదాపు 5.16 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో రూ.10 నోట్లు(2.49 లక్షలు) ఉన్నాయి.
- చలామణీలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం వరుసగా 3.9%, 7.8 శాతం మేర వృద్ధి చెందాయి. ఏడాది క్రితం ఇవి వరుసగా 7.8%, 4.4% మేర పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి