RBI: అధిక ఉష్ణోగ్రతలకు.. EMIల పెరుగుదలకు సంబంధం ఏంటీ..?
దేశంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోవడం రానున్న రోజుల్లో ఈఎంఐలు (EMI) పెరగడానికి కారణమవుతుందని మార్కెట్ విశ్లేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గోధుమలు, కూరగాయల ధరలు పెరగడం వంటి ఆర్బీఐ (RBI) కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచేందుకు కారణమవుతాయని చెబుతున్నాయి.
ముంబయి: ఫిబ్రవరిలో ఎండలు మండిపోయాయి. గత 120ఏళ్లలో ఫిబ్రవరిలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రానున్న నెలల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందనడానికి ఇది సూచికని అర్థమవుతోంది. ఇక్కడివరకు ఎలాగున్నా.. ఇంటి రుణం తీసుకున్న వారిపై ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉండనుందని నిపుణులు హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అవును.. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోవడమనేది ఏప్రిల్లో ఆర్బీఐ ప్రకటించే ద్రవ్య పరపతి విధానంపైనా ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషణ ఏజెన్సీ ‘ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్’ అంచనా వేసింది. ‘ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. 2022లో మాదిరిగా ఇవి గోధుమ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈసారి గోధుమల దిగుమతి 112 మిలియన్ మెట్రిక్ టన్నులుగా వేసిన ముందస్తు అంచనాలతో పోలిస్తే ఇవి 107 మి.టన్నులకు పడిపోయే ప్రమాదం ఉంది. దాంతో ధరలు పెరుగుతాయి. మొన్నటి డిసెంబర్, జనవరి నెలల్లో నమోదైన ద్రవ్యోల్బణంలో పదిశాతం ఇలా గోధుమల ధరలు పెరుగుదల వల్లే’నని ఇండియా రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని ప్రస్తావించడంతోపాటు గోధుమ ధరల నియంత్రణ కోసం ఓపెన్ మార్కెట్ సేల్ విధానాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది.
ద్రవ్యోల్బణంపై ఆందోళన..
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 2023లో నమోదైన ఉష్ణోగ్రతలు గడిచిన 122 ఏళ్లలో ఆ నెలలో ఎన్నడూ నమోదు కాలేదు. ఐఎండీ నివేదికకు ముందు.. ఇండియా రేటింగ్స్ కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలను తన నివేదికలో ప్రస్తావించింది. రానున్న రోజుల్లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది. ఫిబ్రవరి 17-23తేదీల్లో పంజాబ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా ఉన్నట్లు తెలిపింది. గోధుమల ఉత్పత్తికి కీలకంగా ఉన్న పంజాబ్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. గోధుమల దిగుబడి తగ్గడంతోపాటు వేసవి ప్రారంభంలో కూరగాయల ధరల్లో పెరుగుదల, ఇతర వస్తువుల ధరలు తగ్గకపోవడం వంటివి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తాయని వెల్లడించింది.
ఆర్బీఐ మళ్లీ పెంచుతుందా..?
గత సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లను 25బేస్ పాయింట్ల మేర పెంచిన విషయాన్ని ఇండియా రేటింగ్స్ గుర్తుచేసింది. ద్రవ్యోల్బణం తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని.. అందుకు అనుగుణంగా భవిష్యత్తులో ద్రవ్య పరపతి విధానంపై నిర్ణయం ఉంటుందని ఆర్బీఐ అప్పట్లో తెలిపింది. ఈ నేపథ్యంలో వేసవి మొదలుకావడం.. గోధుమలు, కూరగాయల వంటి వస్తువుల ధరలు పెరగడం వంటివి ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతాయనే భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్లో ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం కీలక రేట్లను ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేయడం ఇందుకు కారణమవుతోంది.
గృహరుణాలపై ప్రభావం..
ఆర్బీఐ రేట్లను పెంచడం ప్రధానంగా గృహరుణాల ఈఎంఐపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే తక్కువ శాతం వడ్డీతో ఇంటిరుణం తీసుకున్న వారి వార్షిక వడ్డీ సుమారు 9శాతానికి పెరిగింది. ఏప్రిల్లో మరోసారి ఆర్బీఐ వీటి రేట్లను పెంచితే ఈఎంఐ చెల్లింపుదారులపై మరోసారి భారం పడుతుంది. మే 2022 నుంచి హౌసింగ్ లోన్ ఈఎంఐలు క్రమంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల