JioMart: క్విక్ కామర్స్లోకి రిలయన్స్.. 30 నిమిషాల్లో డెలివరీ?
JioMart: జియోమార్ట్ పేరిట రిలయన్స్ ఇప్పటికే నిత్యావసర సరకులను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లోనే క్విక్ కామర్స్ విభాగాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
JioMart | ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరిగి క్విక్ కామర్స్ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రిలయన్స్ రిటైల్ ఓ టీమ్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, బీబీనౌ తరహాలో 10 నిమిషాల్లో డెలివరీ మోడల్ను రిలయన్స్ అనుసరించబోవడం లేదని తెలుస్తోంది.
జియోమార్ట్ (JioMart) పేరిట కొవిడ్ సమయంలో రిలయన్స్ నిత్యావసర సరకుల డెలివరీ విభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, ఫ్లిప్కార్ట్, అమెజాన్ తరహాలో ఆర్డర్ చేసిన రోజే డెలివరీని మాత్రం హామీ ఇవ్వలేదు.
రిలయన్స్ రిటైల్ (Reliance Retail) భిన్నంగా 30 నిమిషాల్లో డెలివరీ చేసే వ్యాపార నమూనాను సిద్ధం చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. సొంత స్టోర్లు, వాటి నుంచి కొనుగోలు చేసే కిరాణా దుకాణాల నుంచి వస్తువులను సేకరించి కస్టమర్లకు అందించే యోచనలో ఉంది. జియోమార్ట్ పార్ట్నర్లో భాగంగా 20 లక్షల కిరాణా దుకాణాలు రిలయన్స్ రిటైల్ హోల్సేల్ విభాగం నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో ఇతర క్విక్ కామర్స్ సంస్థల తరహాలో ప్రతి ఏరియాలో డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.
ఫైండ్ (FYND), లోకస్ వంటి టెక్ ప్లాట్ఫామ్ల సేవలు ఉపయోగించి వేగవంతమైన రూట్లలో 30 నిమిషాల్లో డెలివరీ చేయాలని రిలయన్స్ ప్లాన్ చేసింది. తొలుత నిత్యావసర సరకులతో సేవలను ప్రారంభించే యోచనలో ఉంది. తర్వాత దుస్తులు, ఎలక్ట్రానిక్స్కూ విస్తరించనున్నట్లు సమాచారం. రిలయన్స్ రిటైల్కు ఉన్న 19,000కు పైగా స్టోర్లు అందుకు దోహదం చేయనున్నాయి.
వచ్చే నెలలోనే రిలయన్స్ క్విక్ కామర్స్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కంపెనీ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. తొలుత దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్, కోల్కతా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ‘జియోమార్ట్ ఎక్స్ప్రెస్ (JioMart Express)’ పేరిట వీటిని అందించనున్నట్లు తెలుస్తోంది. జియోమార్ట్ యాప్లోనే ఇది భాగంగా ఉండనుంది. రిలయన్స్ 2023లోనే క్విక్ కామర్స్ను ముంబయిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కానీ, వివిధ కారణాల వల్ల దాన్ని నిలిపివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్