Retail inflation: 4 నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
Retail inflation in oct: రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ నెలలో 4.87 శాతంగా నమోదైందని కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది.
Retail inflation | దిల్లీ: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) తగ్గుముఖం పట్టింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో వినియోగదారుల ధర సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్లో 4.87 శాతంగా నమోదైందని కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది. ఇది నాలుగు నెలల కనిష్ఠం. అంతకుముందు సెప్టెంబర్ నెలలో నెల 5.02 శాతంగా ఉంది. చివరిగా జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా నమోదైంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా నమోదు కావొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ నెల ఎంపీసీ భేటీలో అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచే బాధ్యతను ప్రభుత్వం ఆర్బీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులను బట్టి రెపో రేటును పెంచుతూ వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం తన వంతు చర్యలు చేపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?