Sam Bankman Fried: ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
న్యూయార్క్: దివాలా తీసిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్కు (Sam Bankman Fried) న్యూయార్క్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారుకు ముందు బ్యాంక్మన్ వ్యవహార శైలిపై న్యాయమూర్తి లెవిస్ కప్లన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ఆయన అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. కస్టమర్ల డబ్బు ఇతర మార్గాల్లోకి వెళ్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు.
తప్పులు జరుగుతున్నట్లు బ్యాంక్మన్కు (Sam Bankman Fried) ముందే తెలుసని న్యాయమూర్తి తేల్చారు. కస్టమర్లను మోసం చేశాననే బాధ ఉన్నప్పటికీ.. విచారణలో మాత్రం దాన్ని ఆయన అంగీకరించలేదన్నారు. బ్యాంక్మన్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. శిక్షను 5 - 6.5 ఏళ్లకు పరిమితం చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని, ఇది అతడి జీవితంలో తొలి నేరమని పేర్కొన్నారు. మానసికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పైగా సంస్థ దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కస్టమర్లు తాము కోల్పోయిన సొమ్ములో మెజారిటీ భాగాన్ని పొందే అవకాశం ఉందని చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తక్కువ తీవ్రత గల శిక్షను ఖరారు చేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాత్రం చట్టప్రకారం బ్యాంక్మన్కు దాదాపు 100 ఏళ్ల శిక్ష పడాల్సి ఉందని తెలిపారు. కానీ, దాన్ని 40 ఏళ్లకు పరిమితం చేయాలని కోరారు. చివరకు న్యాయమూర్తి కల్పన్ 25 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. ఇది దీర్ఘకాల శిక్షగా అనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధించాల్సిన దానితో పోలిస్తే చాలా తక్కువని తెలిపారు. ఈమాత్రం కూడా శిక్ష పడకపోతే.. భవిష్యత్తులో మళ్లీ తీవ్ర నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. తీర్పునకు ముందు బ్యాంక్మన్ కోర్టులో తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘‘నా వల్ల చాలా మంది నిరాశ చెందారు. దానికి క్షమాపణలు చెబుతున్నా. జరిగిన దానికి చింతిస్తున్నా’’ అని నెమ్మదిగా మాట్లాడుతూ అన్నారు.
ఎవరీ బ్యాంక్మన్?
2017లో వాల్ స్ట్రీట్లో ఉద్యోగం వదిలేసిన బ్యాంక్మన్.. అలమెడా రీసెర్చ్ పేరిట హెడ్జ్ ఫండ్ను ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత ఎఫ్టీఎక్స్ పేరుతో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ను నెలకొల్పారు. క్రిప్టో ర్యాలీతో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆయన సంపద 26 బిలియన్ డాలర్లకు చేరింది. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్లు కూడా నిండలేదు. ఆ సంపదతో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థులకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. 2022 అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందజేశారు. బహమాస్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించిన బ్యాంక్మన్.. తనదైన ఆహార్యంతో అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. బిల్ క్లింటన్ వంటి హేమాహేమీలతోనూ ఆయన షార్ట్స్ ధరించి సమావేశమయ్యేవారు. క్రిప్టో సురక్షితమైన పెట్టుబడని చెప్పడం కోసం పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. అందుకోసం హాలీవుడ్కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలను రంగంలోకి దింపారు.
ఇదీ జరిగిందీ..
అసలు వివాదం ఎఫ్టీఎక్స్, అలమెడా రీసెర్చ్ మధ్య సంబంధంతోనే మొదలైంది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు వేర్వేరని బ్యాంక్మన్ (Sam Bankman Fried) చెప్పేవారు. కానీ, అది వాస్తవం కాదని తర్వాత తేలింది. అలమెడా ఆస్తుల్లో చాలా వరకు ఎఫ్టీఎక్స్ ఆవిష్కరించిన ఎఫ్టీటీ క్రిప్టో టోకెన్ల రూపంలోనే ఉన్నట్లు తెలిపింది. మార్కెట్ విలువ ప్రకారం తమ ఎఫ్టీటీ టోకెన్ల విలువ బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అప్పట్లో అలమెడా లెక్కగట్టింది. వాస్తవానికి టోకెన్లన్నీ ఈ ఇరు సంస్థల అధీనంలోనే ఉన్నాయి. అసలు సర్క్యులేషన్లో ఉన్నవి చాలా తక్కువ. అంటే అలమెడా విలువ పూర్తిగా ఊహాజనితమే.
ఈ విషయం బయటకు రాగానే ఎఫ్టీఎక్స్ ప్రత్యర్థి సంస్థ బైనాన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ వద్ద ఉన్న ఎఫ్టీటీ టోకెన్లను అన్నింటినీ విక్రయించేసింది. దీంతో మిగతా ట్రేడర్లు సైతం తమ ఎఫ్టీటీ హోల్డింగ్స్ను వదిలించుకునేందుకు ఎగబడ్డారు. ఫలితంగా ఎఫ్టీటీ విలువ 75 శాతానికి పైగా పడిపోయింది. అలమెడా ఆస్తుల విలువ పూర్తిగా ఆవిరైంది. మరోవైపు ఎఫ్టీఎక్స్ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు ఎగబడ్డారు. కానీ, కస్టమర్లు, ఇన్వెస్టర్ల ఫండ్లను అప్పటికే ఎఫ్టీఎక్స్ అక్రమంగా అలమెడా లోన్ల కోసం తనఖా కిందకు తరలించింది. తద్వారా అలమెడా నష్టాలను పూడ్చేందుకు ప్రయత్నించారు. అలాగే రాజకీయ విరాళాలు, బహమాస్లో విలాసవంతమైన లైఫ్స్టైల్ కోసం వినియోగించారు. కానీ, మదుపర్లు ఒక్కసారిగా విత్డ్రాలకు ఎగబడడంతో ఎఫ్టీఎక్స్ వద్ద మదుపర్లకు చెల్లించేందుకు నిధులు లేవు. మరోవైపు అలమెడా దగ్గర ఉన్న టోకెన్లకు విలువ లేకుండా పోయింది. ఫలితంగా ఎఫ్టీఎక్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యవహారంలో బ్యాంక్మన్తో పాటు మరో ముగ్గురూ ఉన్నారు. వారంతా తప్పులను కోర్టు ముందు అంగీకరించారు. బ్యాంక్మన్ ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు తెలిపారు. కస్టమర్లను మోసం చేయడం, అక్రమ నగదు చలామణి సహా మొత్తం ఏడు అభియోగాల్లో బ్యాంక్మన్ను గత నవంబరులో కోర్టు దోషిగా తేల్చింది. దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక నేరం జరిగినట్లు గుర్తించింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!