SBI: లోన్ వాయిదా ఎగ్గొట్టబోయేవారికి చాక్లెట్.. ఎస్బీఐ వినూత్న కార్యక్రమం!
SBI: రుణాల వసూలును మెరుగుపర్చేందుకు ఎస్బీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లోన్ ఎగ్గొట్టే అవకాశం ఉన్నవారికి చాక్లెట్లు పంపి మరీ గుర్తుచేయాలని నిర్ణయించింది.
ముంబయి: లోన్ తీసుకున్నవారు సకాలంలో వాయిదాలు చెల్లించేలా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. నెలవారీ వాయిదాలు (EMI) ఎగ్గొట్టే అవకాశం ఉన్నవారికి చాక్లెట్లు పంపాలని నిర్ణయించింది. తద్వారా వారికి వాయిదా కట్టాలని గుర్తు చేయాలనుకుంటున్నట్లు తెలియజేసింది.
వాయిదా ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తున్న రుణగ్రహీత బ్యాంక్ నుంచి వచ్చే రిమైండర్ కాల్కు సమాధానం ఇవ్వడం లేదని గుర్తించినట్లు ఎస్బీఐ (SBI) తెలిపింది. కాబట్టి అలాంటి వారి ఇంటికి ముందస్తు సమాచారం లేకుండా వెళ్లి చాక్లెట్లు ఇచ్చి వాయిదా కట్టాలని గుర్తుచేయాలనుకుంటున్నట్లు తెలిపింది. రిటైల్ రుణాలు, వాటిపై వడ్డీరేట్లు పెరుగుతున్న నేపథ్యంలో వసూళ్లను మెరుగుపర్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే రెండు ఫిన్టెక్లతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఎస్బీఐ (SBI) తెలిపింది. ఈ సంస్థలు కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)ను ఉపయోగించి తమ రుణగ్రహీతలకు వాయిదా సమీపిస్తున్న సమయంలో రిమైండర్లు పంపుతాయని తెలిపింది. వాయిదా ఎగ్గొట్టే అవకాశం ఉన్నవారిని గుర్తించి ఆ సమాచారాన్ని ఒక ఫిన్టెక్ తమకు తెలియజేస్తుందని తెలిపింది. అలాగే సంస్థ ప్రతినిధులు కొంతమంది రుణగ్రహీతల ఇంటికి చాక్లెట్తో వెళ్లి గుర్తుచేస్తారని వివరించింది. ఈ కార్యక్రమాన్ని 15 రోజుల క్రితం నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ప్రోగ్రాం సక్సెస్ అయినట్లు వెల్లడించింది. మరికొన్ని ఫిన్టెక్లతోనూ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇది విజయవంతమైతే.. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. అయితే, మరో నాలుగు నుంచి ఐదు నెలల పాటు దీన్ని పైలట్ కార్యక్రమంగానే అమలు చేస్తామని వెల్లడించింది.
SBI రిటైల్ లోన్ బుక్ 2023 జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.10.34 లక్షల కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ.12.04 లక్షల కోట్లకు చేరుకుంది. బ్యాంక్ మొత్తం లోన్ బుక్లో అధిక వాటా రిటైల్ రుణాలదేనని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ రిటైల్ రుణాల్లో ఏటా రెండంకెల శాతం వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?