Salary Hike: సీనియర్ ఉద్యోగులకు ఈ ఏడాది 20 శాతం వేతన పెంపు: పేజ్ గ్రూప్ నివేదిక
Salary Hike: కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాయని ప్రముఖ గ్రూప్ ఓ నివేదికలో పేర్కొంది. ఈక్రమంలో ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
దిల్లీ: కంపెనీల్లో సీనియర్ లెవెల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ఏడాది సగటున 20 శాతం వరకు వేతన పెంపు (Salary Hike) ఉండొచ్చని ‘మైకేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్ 2024’ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి బలంగా ఉన్న నేపథ్యంలో నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపైనే కంపెనీలు ప్రధానంగా దృష్టి సారించాయని పేర్కొంది. సంప్రదాయ పరిశ్రమలలో నియామకాలు పుంజుకుంటున్నాయని.. ముఖ్యంగా తయారీ, ఆపరేషన్స్ ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉన్నట్లు తెలిపింది.
వివిధ రంగాల్లో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్లో నైపుణ్యం ఉన్నవారి అవసరం గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. BFSI, ఇంజినీరింగ్ & తయారీ, ఫైనాన్స్ & అకౌంటింగ్, హెల్త్కేర్ & లైఫ్ సైన్సెస్, మానవ వనరులు సహా పలు కీలకరంగాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని అంచనా వేసింది. దేశీయ పెట్టుబడులు, బహిర్గత అంశాల ప్రభావం లేకపోవడంపైనే దేశం ఆరుశాతం వృద్ధిరేటు ఆధారపడి ఉందని పేర్కొంది.
భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారంగా ఉన్న ఐటీ సేవల పరిశ్రమ కొత్తరూపు సంతరించుకుంటోందని పేజ్ గ్రూప్ ఎండీ అంకిత్ అగర్వాలా వెల్లడించారు. ఈ రంగంలోని కంపెనీలు దాదాపు 8-10 శాతం వరకు వేతనాలను పెంచే (Salary Hike) యోచనలో ఉన్నట్లు తెలిపారు. కన్జ్యూమర్, పునరుత్పాదక, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లోకి దేశీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు చెప్పారు.
ఐటీ అండ్ టెక్ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం, మధ్యశ్రేణి వారికి 30-40 శాతం, సీనియర్ ఉద్యోగులకు 20-30 శాతం వరకు వేతన పెంపు ఉంటుందని నివేదిక తెలిపింది. స్థిరాస్తి, నిర్మాణ రంగంలో ఈ పెంపు (Salary Hike) వరుసగా 20-30 శాతం, 25-45 శాతం, 20-30 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఒక్క వేతనం విషయంలోనే కాకుండా పని విధానం, వృద్ధి అవకాశాల్లోనూ కంపెనీలు తమ ఉద్యోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్