Salary Hike: సీనియర్ ఉద్యోగులకు ఈ ఏడాది 20 శాతం వేతన పెంపు: పేజ్ గ్రూప్ నివేదిక
Salary Hike: కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాయని ప్రముఖ గ్రూప్ ఓ నివేదికలో పేర్కొంది. ఈక్రమంలో ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
దిల్లీ: కంపెనీల్లో సీనియర్ లెవెల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ఏడాది సగటున 20 శాతం వరకు వేతన పెంపు (Salary Hike) ఉండొచ్చని ‘మైకేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్ 2024’ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి బలంగా ఉన్న నేపథ్యంలో నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపైనే కంపెనీలు ప్రధానంగా దృష్టి సారించాయని పేర్కొంది. సంప్రదాయ పరిశ్రమలలో నియామకాలు పుంజుకుంటున్నాయని.. ముఖ్యంగా తయారీ, ఆపరేషన్స్ ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉన్నట్లు తెలిపింది.
వివిధ రంగాల్లో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్లో నైపుణ్యం ఉన్నవారి అవసరం గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. BFSI, ఇంజినీరింగ్ & తయారీ, ఫైనాన్స్ & అకౌంటింగ్, హెల్త్కేర్ & లైఫ్ సైన్సెస్, మానవ వనరులు సహా పలు కీలకరంగాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని అంచనా వేసింది. దేశీయ పెట్టుబడులు, బహిర్గత అంశాల ప్రభావం లేకపోవడంపైనే దేశం ఆరుశాతం వృద్ధిరేటు ఆధారపడి ఉందని పేర్కొంది.
భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారంగా ఉన్న ఐటీ సేవల పరిశ్రమ కొత్తరూపు సంతరించుకుంటోందని పేజ్ గ్రూప్ ఎండీ అంకిత్ అగర్వాలా వెల్లడించారు. ఈ రంగంలోని కంపెనీలు దాదాపు 8-10 శాతం వరకు వేతనాలను పెంచే (Salary Hike) యోచనలో ఉన్నట్లు తెలిపారు. కన్జ్యూమర్, పునరుత్పాదక, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లోకి దేశీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు చెప్పారు.
ఐటీ అండ్ టెక్ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం, మధ్యశ్రేణి వారికి 30-40 శాతం, సీనియర్ ఉద్యోగులకు 20-30 శాతం వరకు వేతన పెంపు ఉంటుందని నివేదిక తెలిపింది. స్థిరాస్తి, నిర్మాణ రంగంలో ఈ పెంపు (Salary Hike) వరుసగా 20-30 శాతం, 25-45 శాతం, 20-30 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఒక్క వేతనం విషయంలోనే కాకుండా పని విధానం, వృద్ధి అవకాశాల్లోనూ కంపెనీలు తమ ఉద్యోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి