Stock market: మోదీ 3.0 లోడింగ్.. సూచీలు ఫుల్ స్వింగ్..!
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2,500 పాయింట్లు, నిఫ్టీ 733 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి ట్రేడింగ్లో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దలాల్ స్ట్రీట్లో బుల్ రంకెలేసింది. దీనికి జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు తోడవ్వడం మరింత బూస్ట్ ఇచ్చింది. దీంతో ఆరంభం నుంచి మార్కెట్లు ముగిసేవరకు అదే దూకుడు కొనసాగింది. సూచీల లాభాల పరుగుకు రికార్డులు బద్ధలయ్యాయి. మునుపెన్నడూ చూడని సరికొత్త గరిష్ఠాలను సూచీలు నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 76,400 మార్కును అందుకోగా.. నిఫ్టీ సైతం 23,200 ఎగువన ముగిసింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.12.50 లక్షల కోట్ల మేర పెరిగింది.
సెన్సెక్స్ ఉదయం 76,583.29 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే దాదాపు 2,700 పాయింట్లు లాభంతో ప్రారంభమవడంతో ఈ ఉత్సాహం కాసేపే అనుకున్నారు. కానీ ఎక్కడా తగ్గేదేలా అన్నట్లుగా దూకుడు సాగింది. ఇంట్రాడేలో 76738.89 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 2,507 పాయింట్ల లాభంతో 76,468.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 733.20 పాయింట్ల లాభంతో 24,263.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.14గా ఉంది.
సెన్సెక్స్లో హెచ్సీఎల్ టెక్, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్టీ, యాక్సిస్ బ్యాంక్ భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.71 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 2,349 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- భారీ లాభాల్లో అదానీ స్టాక్స్: సోమవారం నాటి ట్రేడింగ్లో అదానీ గ్రూప్ స్టాక్స్ పరుగులు తీశాయి. ఆ గ్రూప్నకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీలూ లాభాల్లో ముగిశాయి. అదానీ పవర్ అత్యధికంగా 16 శాతం మేర లాభపడింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 10.61, అదానీ ఎనర్జీ సొల్యూషనస్ 9.15 శాతం చొప్పున లాభపడ్డాయి. మిగిలిన స్టాక్స్ కూడా 3-8 శాతం మధ్య లాభపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..