Stock market: నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 114 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 24 Apr 2024 16:11 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మన మార్కెట్లను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా మెటల్‌ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆఖర్లో ఐటీ షేర్లలో అమ్మకాల కారణంగా స్వల్ప లాభాలకే సూచీలు పరిమితమయ్యాయి. నిఫ్టీ 22,400 ఎగువన ముగిసింది.

ఉదయం 73,957.57 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే ఒరవడిని కొనసాగించింది. ఇంట్రాడేలో 73,788.61 - 74,121.61 మధ్య కదలాడింది. చివరికి 114.49 పాయింట్ల లాభంతో 73,852.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.40 పాయింట్ల లాభంతో 22,402.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.33గా ఉంది. సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్ షేర్లు రాణించాయి. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 88.14 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని