Stock market update: ఆద్యంతం నష్టాల్లోనే సూచీలు.. 361 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 361 పాయింట్లు, నిఫ్టీ 92 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 26 Mar 2024 16:02 IST

Stock market | ముంబయి: దేశీయ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్ షేర్లు అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కోవడం సూచీలను పడేశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 72,396.97 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభం అయ్యింది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 72,363.03- 72,705.29 మధ్య చలించిన సూచీ.. చివరికి 361.64 పాయింట్ల నష్టంతో 72,470.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 92.05 పాయింట్ల నష్టంతో 22,004.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.29గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 86.74 వద్ద, బంగారం ఔన్సు ధర 2,214 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని