Stock market: భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజూ సూచీలు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు.. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు దూసుకెళ్లాయి. ఓ దశలో సరికొత్త రికార్డులను తిరగరాస్తాయనుకున్న సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1100 పాయింట్ల లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. తర్వాత 655 పాయింట్లతో సరిపెట్టుకుంది.
సెన్సెక్స్ ఉదయం 73,149.34 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఓ దశలో 74,190 పాయింట్లకు చేరుకున్న సెన్సెక్స్.. చివరికి 655 పాయింట్ల లాభంతో 73,651.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 203.25 పాయింట్ల లాభంతో 22,326.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.40గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా రాణించాయి. టెక్ మహీంద్రా, రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఐటీసీ షేర్లు స్వల్ప నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 86.70 డాలర్లు, బంగారం ఔన్సు 2,218 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
లాభాల పరుగుకు కారణమిదే..
- నిన్నటి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్ 1.22 శాతం, ఎస్అండ్పీ 500.. 0.86 శాతం, నాస్డాక్ 0.51 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇవాళ ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో సానుకూలత కనిపించింది. హాంకాంగ్, ఆస్ట్రేలియా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో మన మార్కెట్లలోనూ అదే ఉత్సాహం కనిపించింది. యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
- విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లూ సూచీలకు కలిసొచ్చాయి. బుధవారం రూ.2,170 కోట్ల విలువైన షేర్లను వీరు కొనుగోలు చేసినట్లు డేటా చెబుతోంది. దేశీయ మదుపరులు రూ.1198 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గడిచిన రెండు నెలలుగా అమ్మకాలు చేపట్టిన విదేశీ మదుపరులు.. మార్చిలో కొనుగోళ్లకు ముందుకు రావడం గమనార్హం. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుండడం వంటివి విదేశీ మదుపరులను ఆకర్షిస్తున్నాయి.
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో కొనుగోళ్లూ సూచీల పరుగుకు కారణమయ్యాయి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు అధిక మొత్తంలో ప్రొవిజన్లు పక్కన పెట్టాలని డిసెంబర్లో ఆర్బీఐ నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా ఆ నిబంధనలను సడలించడంతో పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 శాతం మేర లాభపడింది.
కోటక్ చేతికి సొనాటా ఫైనాన్స్: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా ఎన్బీఎఫ్సీ కంపెనీ సొనాటా ఫైనాన్స్ను కొనుగోలు చేసింది. రూ.537 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోటక్ బ్యాంక్ తన రెగ్యులేటరీలో పేర్కొంది. సొనాటాకు 10 రాష్ట్రాల్లో 549 బ్రాంచిలు ఉన్నాయి. ఈ కొనుగోలుతో సొనాటా పూర్తిగా కోటక్ మహీంద్రా అనుబంధ సంస్థగా కొనసాగనుంది.
మార్కెట్లకు రేపు సెలవు: గుడ్ఫ్రైడే కారణంగా రేపు మార్కెట్లకు సెలవు. సోమవారం హోలీ సందర్భంగా మార్కెట్లు పనిచేయలేదు. దీంతో ఈ వారం మూడు రోజులే ట్రేడింగ్ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవాళే చివరి ట్రేడింగ్ సెషన్ కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్