Stock market: భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజూ సూచీలు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు.. ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు దూసుకెళ్లాయి. ఓ దశలో సరికొత్త రికార్డులను తిరగరాస్తాయనుకున్న సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1100 పాయింట్ల లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. తర్వాత 655 పాయింట్లతో సరిపెట్టుకుంది.
సెన్సెక్స్ ఉదయం 73,149.34 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఓ దశలో 74,190 పాయింట్లకు చేరుకున్న సెన్సెక్స్.. చివరికి 655 పాయింట్ల లాభంతో 73,651.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 203.25 పాయింట్ల లాభంతో 22,326.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.40గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా రాణించాయి. టెక్ మహీంద్రా, రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఐటీసీ షేర్లు స్వల్ప నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 86.70 డాలర్లు, బంగారం ఔన్సు 2,218 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
లాభాల పరుగుకు కారణమిదే..
- నిన్నటి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్ 1.22 శాతం, ఎస్అండ్పీ 500.. 0.86 శాతం, నాస్డాక్ 0.51 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇవాళ ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో సానుకూలత కనిపించింది. హాంకాంగ్, ఆస్ట్రేలియా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో మన మార్కెట్లలోనూ అదే ఉత్సాహం కనిపించింది. యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
- విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లూ సూచీలకు కలిసొచ్చాయి. బుధవారం రూ.2,170 కోట్ల విలువైన షేర్లను వీరు కొనుగోలు చేసినట్లు డేటా చెబుతోంది. దేశీయ మదుపరులు రూ.1198 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గడిచిన రెండు నెలలుగా అమ్మకాలు చేపట్టిన విదేశీ మదుపరులు.. మార్చిలో కొనుగోళ్లకు ముందుకు రావడం గమనార్హం. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుండడం వంటివి విదేశీ మదుపరులను ఆకర్షిస్తున్నాయి.
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో కొనుగోళ్లూ సూచీల పరుగుకు కారణమయ్యాయి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు అధిక మొత్తంలో ప్రొవిజన్లు పక్కన పెట్టాలని డిసెంబర్లో ఆర్బీఐ నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా ఆ నిబంధనలను సడలించడంతో పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 శాతం మేర లాభపడింది.
కోటక్ చేతికి సొనాటా ఫైనాన్స్: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా ఎన్బీఎఫ్సీ కంపెనీ సొనాటా ఫైనాన్స్ను కొనుగోలు చేసింది. రూ.537 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోటక్ బ్యాంక్ తన రెగ్యులేటరీలో పేర్కొంది. సొనాటాకు 10 రాష్ట్రాల్లో 549 బ్రాంచిలు ఉన్నాయి. ఈ కొనుగోలుతో సొనాటా పూర్తిగా కోటక్ మహీంద్రా అనుబంధ సంస్థగా కొనసాగనుంది.
మార్కెట్లకు రేపు సెలవు: గుడ్ఫ్రైడే కారణంగా రేపు మార్కెట్లకు సెలవు. సోమవారం హోలీ సందర్భంగా మార్కెట్లు పనిచేయలేదు. దీంతో ఈ వారం మూడు రోజులే ట్రేడింగ్ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవాళే చివరి ట్రేడింగ్ సెషన్ కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్