Stock market: రోజంతా ఒడుదొడుకులు.. 220 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 220 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 28 May 2024 15:59 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు చూపడమే ఇందుకు కారణం.

సెన్సెక్స్‌ ఉదయం 75,585.40 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,083.22 - 75,585.40 మధ్య కదలాడింది. చివరికి 220.05 పాయింట్ల నష్టంతో 75,170.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 44.30 పాయింట్ల నష్టంతో 22,888.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.18గా ఉంది. సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 83.23 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. ఔన్సు బంగారం ధర 2,344 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని