Stock market: కొత్త ఏడాదిలో లాభాలు జోరు.. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 363, నిఫ్టీ 135 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 01 Apr 2024 16:27 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని లాభాలతో ఆరంభించాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకిన సూచీలు.. కాస్త క్షీణించి ఓ మోస్తరు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల మూలంగా సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 74 వేలు, నిఫ్టీ 22,450 ఎగువన ముగిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 73,968 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 74,254.62 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 363.20 పాయింట్ల లాభంతో 74,014.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 135.10 పాయింట్ల లాభంతో 22,462 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.40గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్టీపీసీ, ఎల్‌అండ్‌ టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టైటాన్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 86.64 డాలర్లు, బంగారం ఔన్సు 2,270 డాలర్లు వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు